నటి పూర్ణ.. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూర్ణ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి మనకు తెలిసిందే. ఇక సీమంతం తర్వాత పూర్ణ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
నటి పూర్ణ.. అవును, అవును2 సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేరును తెచ్చుకుంది. ఇక తెలుగులో సినిమాలతో పాటుగా పలు టెలివిజన్ షోల్లో జడ్జిగా మెరుస్తోంది పూర్ణ. ఈ క్రమంలోనే దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణకు వివాహం జరిగింది. ఇక ఇటీవలే పూర్ణ తన సీమంతాన్ని సైతం జరుపుకుంది. అయితే సీమంతం తర్వాత తాజాగా పూర్ణ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
నటి పూర్ణ.. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ ని పెళ్లి చేసుకుంది పూర్ణ. ఇక కొన్ని రోజుల క్రితమే తన సీమంతాన్ని వైభవంగా జరుపుకుంది పూర్ణ. అయితే తాజాగా పూర్ణ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పూర్ణ షేర్ చేసిన ఫోటోల్లో ఓ తెల్లటి వస్త్రాన్ని నడుముకు చుట్టుకుని నల్లటి దారాన్ని కట్టుకుంది. ఈ పిక్స్ చూసిన అభిమానులు నిండు గర్భిణీగా ఉన్న పూర్ణకు ఏమైంది అని ఆందోళన పడుతున్నారు. అయితే ఈ పిక్స్ పై వివరణ ఇచ్చింది పూర్ణ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే? వారి ఆచారంలో గర్భిణీలకు ఏడో నెల వస్తే ‘కానూర్’ అనే సంప్రదాయ తంతును నిర్వహిస్తారట. ఆ ఆచారంలో భాగంగానే పూర్ణ తెల్లటి వస్త్రాన్ని ఇలా నడుముకు చుట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది పూర్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.