పూజా హెగ్డే.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాలోనే తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తరువాత ముకుంద సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల్లో నటించింది. అయితే అలా వైకుంఠపురం సినిమాతో హీరోయిన్ ఈ బుట్టబొమ్మ కెరీర్ టర్న్ అయ్యిందనే చెప్ప వచ్చు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఈ కన్నడ బ్యూటీ నటించింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలోనే బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ పూజాకి చేదు అనుభవం ఎదురైంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే.. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. గతంలో మొహంజదారో సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఆ తరువాత అంతగా సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తరువాత 2019 హౌస్ ఫుల్-4 సినిమాలో నటించింది. ఇలా అడపదడప బాలీవుడు సినిమాలో పూజా నటిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలనే కోరిక తో అక్కడ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే హిందీలో ఓసినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ థియేటర్ల వద్ద పరాజయం పాలైంది. బాలీవుడ్ పై ఎన్నో ఆశల పెట్టుకుని వెళ్లిన పూజా హెగ్డేకు చేదు అనుభవమే ఎదురైంది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఉన్న అతి నమ్మకమే ఆమెను నిండాముంచిందని సమాచారం. రణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ సినిమాలో పూజా హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుట్టబొమ్మ.. ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందనే విషయాన్ని వెల్లడించింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో పనిచేయాలనేది తన కలని, ఇదే సమయంలో సర్కస్ సినిమా డేట్స్ కోసం ఆయనే స్వయంగా ఫోన్ చేశారని తెలిపింది. అయితే ఆయనే ఫోన్ చేయడంతో తాను కనీసం కథ, హీరో, వివరాలు ఏమీ అడగకుండానే ఆ సినిమాకు ఓకే చెప్పేశానని తెలిపింది. అలా రోహిత్ శెట్టి దర్శత్వంలో సర్కస్ సినిమాలో రణవీర్ సింగ్ కి జోడిగా పూజా నటించింది. భారీ అంచనాల మధ్య డిసెంబరు 23న పాన్ ఇండియా సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. భారీస్థాయిలో 2500 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. కానీ.. ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లు కనీసం రూ.50 కోట్లు కూడా దాటలేదని బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాకి ప్రమోషన్స్తో సహా రూ.110 కోట్లు వరకూ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లోకి రీఎంట్రీ మూవీనే డిజాస్టర్గా మిగలడంతో ఇప్పుడు ఈ అమ్మడు పునరాలోచనలో పడిపోయింది.
ఇక ఆమె ఆశలన్నీ సల్మాన్ ఖాన్తో నటిస్తున్న “కిసీ కా భాయ్.. కిసీ కా జాన్” సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఒకవేళ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిస్తే? పూజా హెగ్డే బాలీవుడ్ ఆశలకి పూర్తిగా తెరపడనున్నాయి. గతంలో ఇలియాన కూడా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉండగానే బాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడి వారు ఆ గోవా బ్యూటీని తిరష్కరించడంతో ఇక తెరపై కనుమరుగైంది. మరి.. పూజా పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మరి.. బాలీవుడ్ లో పూజాకు ఎదురైన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.