నటి పావలా శ్యామల ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె.. తన కుమార్తెతో కలిసి హైదరాబాద్ లోని ఓ వృద్ధాశ్రమంలో గత కొన్నాళ్ల నుంచి ఉంటున్నారు. తెలుగులో హాస్యనటి, సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామలకు ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం లభించట్లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఆమె పలు ఇంటర్వ్యూలో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కలవాలని ఉందని అన్నారు. ఆయనకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నట్లు కూడా పావలా శ్యామల పేర్కొన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పలువురు తెలుగు స్టార్ హీరోలు దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారని ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు కనిపించాయి. ఇప్పుడు వాటిపై స్పందించిన ఆమె.. వీటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ‘గబ్బర్ సింగ్’ టైంలో పవన్ కల్యాణ్ తనకు రూ.1 లక్ష సాయం చేశారని తెలిపారు. మందులు కొనడానికి డబ్బుల్లేక.. సినిమాలో చిన్న పాత్ర ఉంటే ఇప్పించమని పవన్ కల్యాణ్ ని అడగడానికి వెళ్లానని, తన ఇబ్బందులు తెలుసుకుని ఆయన రూ.లక్ష ఇచ్చారని శ్యామల చెప్పారు. ఇక మెగాస్టార్ హీరో చిరంజీవి తోటీ నటీనటులను గౌరవంగా చూసుకుంటారని, అందరినీ అభిమానిస్తుంటారని పావలా శ్యామల చెప్పారు.
‘చిరంజీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. స్టార్ అయినప్పటికీ ఆయన ఎంతో అంకితభావం చూపిస్తుంటారు. కరోనా సమయంలోనూ ఎంతోమందికి సాయం చేశారు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని రూ.2 లక్షలు పంపించి ఆదుకున్నారు. నటీనటులకు ఎలాంటి అన్యాయం జరిగినా సరే ఆయన ముందుండి మాట్లాడతారు. ఆయనను ఓసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనతో చెప్పాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి తెలిస్తే ఆయన సహించరు’ అని పావలా శ్యామల చెప్పుకొచ్చారు. అయితే తనకు జరిగిన అవమానం ఏంటనేది మాత్రం శ్యామల వెల్లడించలేదు. మరి పావలా శ్యామల దీనస్థితిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.