బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయిపోయారు. తాజాగా శుక్రవారం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో చిత్రబృందం అంతా పాల్గొంది. కానీ ఓ బ్యూటీ మాత్రం.. అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. బాలయ్యతో ఆమెతో స్టేజీపైనే మలయాళంలో మాట్లాడుతూ తెగ నవ్వించాడు. దీంతో మొత్తం ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి, మనసులో కలవరం రేపిన ఆ భామ గురించి తెలుసుకునేందుకు అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి ఆమె ఎవరు, డీటైల్స్ ఏంటి?
ఇక విషయానికొస్తే.. బాలయ్య సినిమా, ప్రీ రిలీజ్ కావొచ్చు ఏదైనా సరే ఆయనే హైలెైట్ అవుతూ ఉంటారు. తాజాగా ‘వీరసింహారెడ్డి’ తన ఎనర్జీ లెవల్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. అయితే రెడ్ డ్రస్ లో హనీ రోజ్ అనే యాక్టర్ కూడా వావ్ అనిపించింది. అందంగా నవ్వుతూ కనిపించింది. ఇక ఆమె ఎవరా అని ఆరా తీస్తే.. మలయాళ బ్యూటీ అని తెలిసింది. కేరళలో పుట్టిన హనీ.. 14 ఏళ్ల ఏజ్ లోనే యాక్టర్ అయిపోయింది. అంటే 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది. అయితే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.
2012లో రిలీజైన ‘త్రివేంద్రం లాడ్జ్’ అనే సినిమాతో హానీ రోజ్ కు బ్రేక్ వచ్చింది. ఇక అక్కడి నుంచి మలయాళ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ వచ్చింది. మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ తో కలిసి నటించింది. అయితే ‘వీరసింహారెడ్డి’నే ఈమె తొలి తెలుగు సినిమా అని చాలామంది అనుకుంటున్నారు కానీ గతంలోనే ఆలయం(2006), ఈ వర్షం సాక్షిగా (2013) అనే తెలుగు మూవీస్ చేసింది. కానీ జనాలకు పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు బాలయ్య కొత్త సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో డ్యాన్స్ తోపాటు మంచి క్యారెక్టర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక హనీరోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్. గతేడాది రిలీజైన ‘మాన్ స్టర్’ మూవీలో మంచు లక్ష్మితో కలిసి లిప్ లాక్ సీన్స్ చేసింది ఈమెనే. మరి అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హానీరోజ్ ని చూసి మీలో ఎంతమంది ఫిదా అయ్యారు. ఆమెని చూడగానే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటనేది కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.