సీనీ ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంటారు. కొంతమంది మాత్రం సినీ జీవితానికి దూరంగా ఆద్యాత్మిక జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటారు.
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగు పెడితే చాలు సెలబ్రెటీ హోదా వస్తుందని చాలా మంది అనుకుంటారు. వెండితెర అనేది అద్భుతమైన రంగుల ప్రపంచం అంటారు. సిని రంగంలో రాణించాంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటే వారిని అందలానికి ఎత్తుతారు. ఒకవేళ వరుస అపజయాలు పలకరిస్తే పూర్తిగా మర్చిపోతారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే గ్లామర్ ఉన్నంత వరకే ఛాన్సులు.. కాస్త ఫేడ్ ఔట్ అయితే అటోమెటిక్ గా ఛాన్సులు దూరమైతాయి. దర్శక, నిర్మాతలు కొత్త హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే చాలా మంది నటీమణులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నాలు ఉంటారు. ఒకప్పుడు వెండితెరపై తన గ్లామర్ తో ఉర్రూతలూగించిన నటి ప్రస్తుతం సన్యాసినిగా మారి ఆద్యాత్మిక జీవితాన్ని గడుపుతుంది. ఎందుకు అలా మారిందీ.. ఇప్పుడు ఆ నటి ఏం చేస్తుందన్న విషయం గురించి తెలుసుకుందాం.
బాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన భూత్ మూవీలో దెయ్యం పట్టిన యువతి పాత్రలో నటించింది నటి బర్ఖా మదన్. భూత్ మూవీలో బర్ఖా నటన చూసి థియేటర్లో గజ గజ వణికిపోయారంటే ఏ రేంజ్ లో నటించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బర్ఖా పంజాబ్ కుటుంబలో జన్మించింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు పలు అందాల పోటీల్లో పాల్గొంది. 1994 లో మిస్ ఇండియా పోటీలో విజేతలు అయిన సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ లతో కలిసి పోటీపడింది. ఈ కాంపిటీషన్ లో సుస్మిత సేన్ కిరీటం దక్కించుకోగా.. రన్నరప్ గా ఐశ్వర్య రాయ్ నిలిచింది. ఇక బర్ఖా మదన్ మిస్ టూరిజం ఇండియాగా నిలిచింది.
సినీ రంగ విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన ఖిలాడియోన్ కా ఖిలాడిలో నటించింది బర్ఖా మదన్. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇండో-డచ్ చిత్రం డ్రైవింగ్ మిస్ పామెన్తో విదేశీ చిత్రాల్లో కూడా నటించింది. హింది, పంజాబీ భాషా చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా నిర్మాత కూడా తన సత్తా చాటింది. గోల్డెన్ గేట్ LLC పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సోచ్, సుర్ఖాబ్ అనే రెండు చిత్రాలు కూడా నిర్మించారు. ఈ రెండు చిత్రాలు విమర్శకుల నుంచి ప్రశంసంలు అందుకున్నాయి. ఇక బర్ఖా మదన్ బుల్లితెరపై ఇప్పటి వరకు దాదాపు 20 టీవీ షోలు చేసింది. బుల్లితెరపై ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బర్ఖా మదన్ ని బౌద్ద మతం యొక్క భావజాలం బాగా ఆకర్శించింది. అంతేకాదు ఆమెకు బర్ఖా మదన్ కి మొదటి నుంచి దలైలామా అంటే ఎంతో ఇష్టం..ఫాలోవర్. ఆయన అడుగుజాడల్లో నడవాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలోనే 2012 లో బుద్దీజం స్వీకరించాని మనసులో పెట్టుకుంది. ఈ క్రమంలోనే లామా జోపా రిన్ పోచే పర్యవేక్షణలో సన్యాసం స్వీకరించింది. ప్రస్తుతం ఆమెను గ్యాల్టెన్ సామ్టెన్ గా పిలుస్తారు. బుద్దీజం స్వీకరించిన తర్వాత తన మనసు ప్రశాంతంగా ఉందని.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, సరైన నిర్ణయంగా భావిస్తున్నానని గతంలో వ్యాఖ్యానించింది.