ఈ మద్య కాలంలో బుల్లితెరపై ఎన్నో రకాల రియాల్టీ షోలు వస్తున్నాయి. సెబల్రెటీలతో కొత్త కొత్తగా రియాల్టీ షోలను తెరపైకి తీసుకు వస్తున్నారు. రియాల్టీ షోలో పాల్గొన్న నటులకు బాగా క్రేజ్ వస్తుంది.
కొందరి సెలబ్రిటీల జీవితాలు తెరముందు కనిపించే విధంగా రంగులమయం ఉండదు. వారి జీవితాల్లో తెరవెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. వ్యక్తిగతంగా చెప్పాలంటే వాళ్లు ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొంటున్నారు. వేధింపుల దగ్గర నుంచి మెుదలు పెడితే ఆర్థిక సమస్యల వరకు.. చెప్పుకోలేని కన్నీటి కథనాలుంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా.. భూమిక వశిష్ట్ అని చెప్పుకోవచ్చు..అయితే సినిమా ఇండస్ట్రీ రియాల్టీ షోలకు కొదవ లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల రియాల్టీ షో లు ఉండగా కొత్త కొత్తా రియాల్టీ షో లను మెుదలు పెడుతూనే ఉన్నారు.అయితే అలా మాములుగా సెలబ్రిటీలు ఎలా ఉంటారు వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. అని చూపించడమే ఈ రియాల్టి షో ల యెుక్క కామన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు..
అయితే ఇలా కొన్ని సార్లు రియాల్టీ షో లలో వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటారని.. ఆ క్రమంలోనే వారి వ్యక్తిగత కు సంబంధించిన విషయాలను కూడా బయటపెట్టడం వాస్తవం అని చెప్పవచ్చు. అయినప్పటికి తాజాగా ఎంటీవీ రోడీస్ అనే కొత్త సీజన్ శనివారం రోజున గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఇందులో భూమిక వశిష్ట్ స్ప్లిట్స్ విల్లా కంటెస్టెంట్ గా ఏంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆ షో లో వ్యక్తం చేసింది. భూమిక వశిష్ట్ మాట్లాడుతూ.. ‘డాన్స్ రియాల్టీ షో తర్వాత నేను సెలబ్రటీలాగానే ఉండిపోవాలనుకుంటున్నాను.. కానీ సెలబ్రిటీ లైఫ్ అనేది డబ్బుతో కూడుకున్న పని.. దానికి కావల్సిన ఫేమ్, గ్లామర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. అందుకని నా లైఫ్ స్టైల్ కోసం అప్పు తీసుకున్నాను’ అని చెప్పింది. అదే సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను.
ఆ సమయంలో అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియో ఒక యాప్ లో ఆప్ లోడ్ చేశాను.. సీక్రెట్ గా ఉండాల్సిన వీడియో ఎవరో లీక్ చేశారు. అది ఎలా వెళ్లిందని ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని తెలిపింది. దాంతో నా పై చాలా విమర్శలు వచ్చాయి. అలా వచ్చినందుకు నేను బాగా డిప్రెషన్ కు గురయ్యాను అని వ్యక్తం చేసింది. భూమిక మాటలు విన్న గ్యాంగ్ లీడర్స్ రియా చక్రవర్తి, ప్రిన్స్ నరూలా భూమికను ఓదార్చారు.. అయితే రియా భూమికను హత్తుకోగా నరూలా మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. నువ్వు ధైర్యంగా ఉండమని తెల్పాడు. ఇక ఇది లా ఉండగా.. ప్రస్తుతం సోనూసూద్ ఎంటీవీ రోడీస్ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నప్పటికి.. ఆ షో లో ప్రిన్స్, నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్ గులటి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఢీల్లీ, పుణె ఇండోర్ నగరాల్లో ఆడిషన్ నిర్వహించారు. ఇందులో కొంతమంది యంగ్ స్టార్స్ ను సెలక్ట్ చేసుకొని షో లో ప్రవేశపెట్టారు.