నేటి సోషల్ మీడియా యుగంలో ఏది నిజం.. ఏది అబద్దమో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కుప్పలు తెప్పలుగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు సమాచారం చేరవేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. దాంతో కొన్ని అసత్యాలను ప్రసారం చేసే యూట్యూబ్ ఛానల్స్ ను సుప్రీం కోర్టు నిషేధించినప్పటికీ ఈ అసత్య వార్తా వాహికలు ఆగడం లేదు. తాజాగా ఏకంగా ఓ ప్రముఖ నటుడు మరణించాడనే వార్తను ప్రచారం చేశారు. దాంతో ఆ నటుడే స్వయంగా వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సుమన్.. 90 వ దశకంలో తన నటనతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టాడు. అప్పట్లో సుమన్ అగ్ర హీరో అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా దక్షిణాది సినీ రంగంపై తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే తాజాగా ఆయనకి సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీని మెుత్తం షాక్ కు గురి చేసింది. ఆ వార్త ఏంటంటే సుమన్ మరణించాడని.. ఆ నోటా ఈ నోట పడిన ఈ వార్త చివరికి సుమన్ చెవికి చేరింది.
దీంతో అతడే డైరెక్టు గా రంగంలోకి దిగి ఓ ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో ఆయన ఈ విధంగా స్పందించారు.” నేను క్షేమంగానే ఉన్నాను. నా అభిమానులెవరూ కంగారు పడొద్దని అలాగే నా అనారోగ్యం పై వస్తోన్న వార్తలు ఎవరూ నమ్మోద్దని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానెల్స్ పై తాను పరువు నష్టం దావా వేయబోతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే నార్త్ ఇండియా యూట్యూబ్ ఛానెల్స్ ఈ వార్తలను ప్రసారం చేసినట్లు నా దృష్టికి వచ్చిందని వారిపై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఓ సినిమా షూటింగ్ నిమత్తం బెంగళూర్ లో ఉన్న ఆయన అక్కడి నుంచే ఈ ప్రకటనను విడుదల చేశారు. మరి ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రసారం చేసే ఛానల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.