సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టుంది. కామెడీ, విలన్, క్యారెక్టర్ పాత్రలు ఏవైనా ఆయన తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తారు. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు. ఇప్పటి వరకు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘ఇద్దరు’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. కాంచీవరం చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.
ఇది చదవండి : యూట్యూబ్ లో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ సరికొత్త రికార్డు..!
తాజాగా స్వీట్ మెమోరీస్ అంటూ.. 2004లో నంది అవార్డు అందుకున్న ఫొటోను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. ‘డా.రాజశేఖర్ రెడ్డి గారు, డా.దాసరి నారాయణరావు గారు.. డా.గుమ్మడి గారి ఆ స్పర్శ ఆహా’ అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ తన కెరీర్లో ఎనిమిది నంది అవార్డులు అందుకున్నారు. పలు భాషల చిత్రాల్లో నటించి మెప్పించారు. రాజకీయంగా కూడా ఆయన యాక్టీవ్ గా ఉంటున్నారు.
Sweet Memories… 2004 Nandi Awards ..
డా॥రాజశేఖర్ రెడ్డి గారు,
డా॥దాసరి నారాయణరావు గారు,
డా॥గుమ్మడి గారి
ఆ స్పర్శ
ఆహా…. pic.twitter.com/dpqjOxEx51— Prakash Raj (@prakashraaj) January 21, 2022