బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నెల రోజుల్లోనే అనేక మంది ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ ఇటీవలే తుది శ్వాస విడిచారు. లో నటుడు కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు.
బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరకు వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నెల రోజుల్లోనే అనేక మంది ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ ఇటీవలే తుది శ్వాస విడిచారు. కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు. మాలీవుడ్ నటుడు హరీష్ పెంగన్ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు లేరన్న వార్త అటు మాలీవుడ్, కోలీవుడ్ను శోక సంద్రంలో ముంచేసింది.
ప్రముఖ నటుడు, విలన్ పాత్రలకు పెట్టింది పేరైన కజాన్ ఖాన్ ఇక లేరు. గుండెపోటుతో ఈ నెల 12న తుది శ్వాస విడిచారు. 1992లో సెంతమిజ్ పట్టు (తెలుగులో అమ్మకొడుకులో కూడా విలన్ క్యారెక్టర్ చేశారు) ద్వారా పరిశ్రమకు పరిచయమ్యారు. ఆయన బాగా పేరు తెచ్చినవి గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. 2015లో వచ్చిన లైలా ఓ లైలాలో ఆఖరి సారిగా కనిపించారు. ఇక తమిళ పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేశారు. తెలుగు, కన్నడ, హిందీ పరిశ్రమలో కూడా విలన్ పాత్రల్లో మెరిశారు. తమిళ బద్రి (తెలుగులో తమ్ముడు) సినిమాలో కూడా కనిపించారు.