ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా హీరోయిన్లు మాత్రమే కాదు.. బుల్లితెర తారలు కూడా స్టార్లు అయిపోతున్నారు. ఇంకా కొన్నాళ్ల నుంచి అయితే యాంకర్లకు కూడా సెలబ్రిటీ హోదా లభిస్తోంది. నిజానికి వెనుకటి రోజుల్లో చాలా కొద్ది మంది మాత్రమే స్టార్ యాంకర్లు అంటూ పేరు పొందేవారు. కానీ, ఇప్పుడు టాలెంట్ ఉన్న ప్రతిఒక్కరికి స్టార్ యాంకర్ హోదా లభిస్తోంది. అలాగే సోషల్ మీడియా ద్వారా వారికి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అలా కొన్నాళ్లుగా మంచి స్టార్డమ్ సొంతం చేసుకున్న యాంకర్ మంజూష. ఆమె యాంకరింగ్, అందం, స్పాంటినిటీతో అభిమానులను సొంతం చేసుకుంటోంది. దాదాపు అన్ని సినిమా ఈవెంట్లలో ఆమే యాంకర్గా కనిపిస్తోంది.
యాంకర్లకు కూడా హీరోయిన్ స్థాయి అభిమానులు ఉంటున్న సంగతి తెలిసిందే. యాంకర్ సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మీ వీళ్ల కోవలోనే మంజూష కూడా స్టార్డమ్ సొంతం చేసుకుంది. తాజాగా మట్టికుస్తీ అనే సినిమా ఈవెంట్లో యాంకర్గా మంజూష వ్యవహరించింది. ఆ కార్యక్రమం ప్రారంభం కాబోయే ముందు కాసేపు అక్కడికి వచ్చిన అభిమానులతో ముచ్చటించారు. వారిలో ఒక వ్యక్తి మైక్ తీసుకుని తనకు ఏ సినిమాలో ఏ హీరోయిన్ నటన బాగా నచ్చింది అనే విషయాలను మంజూషాకు వివరించాడు. ఐశ్వర్య లక్ష్మి నటన అంటే చాలా ఇష్టమట. ఆమె ఎప్పుడన్నా వస్తే చెప్పాలంటూ రిక్వెస్ట్ చేశాడు. అలా కాసేపు ఆ వ్యక్తికి మంజూషాకి మధ్య సరదా సంభాషణ జరిగింది.
అతను తనకు నచ్చిన హీరోయిన్ల గురించి చెప్పిన తర్వాత మంజూష యాంకరింగ్ గురించి పొగడ్తలు స్టార్ట్ చేశాడు. మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అని చెబుతూనే.. వాళ్ల అన్న ఓంకార్కు ఇంకా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే జబర్దస్త్ కు కొత్త యాంకర్ అనగానే.. మంజూష రాబోతున్నారు అని అనుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాట అనగానే మంజూష ఇంక చాలు ఇక్కడితో ఆపేద్దాం అంటూ టాపిక్ డైవెర్ట్ చేసింది. అయతే గతంలో జబర్దస్త్ కోసం కొత్త యాంకర్ని వెతుకుతున్న సమయంలో మంజూష పేరు బాగా వినిపించింది. దాదాపుగా ఆమెను ఖరారు చేశారంటూ చెప్పుకొచ్చారు. బుల్లితెర వర్గాల్లో కూడా యాంకర్ మంజూష పేరు బాగా వినిపించింది. కానీ, అనుహ్యంగా తెరపైకి కన్నడ నటి సౌమ్య రావ్ వచ్చింది. ప్రస్తుతం వీళ్ల సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.