ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ జంట ఎవరంటే.. తమిళ నిర్మాత రవీందర్, ఆయన భార్య మహాలక్ష్మి. వీరిద్దరు వివాహం చేసుకుని.. ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్యులకు కూడా భారీ షాక్ ఇచ్చారు. ఈ జంట మీద వచ్చినన్ని ట్రోల్స్.. ఈ మధ్య కాలంలో ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరిని జంటగా చూసిన జనాలు.. కేవలం డబ్బు కోసం మాత్రమే మహాలక్ష్మి.. రవీందర్ని వివాహం చేసుకుందని విమర్శించారు. అయితే ట్రోల్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. నూతన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. దీపావళి పండుగ సందర్భంగా నిర్మాత రవీందర్.. మహాలక్ష్మికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.
ప్రస్తుతం ఎవరి కెరీర్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మికి సంబంధించి సంచలన విషయలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల క్రితం నటి ఒకరు మహాలక్ష్మి మీద సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని.. అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ ఆరోపించింది. అయితే తాజాగా మరోసారి ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలు..
ప్రముఖ తమిళ నటుడు ఈశ్వర్ రఘునాథ్ భార్య.. జయశ్రీ ఈ సంచలన ఆరోపణలు చేసింది. మూడేళ్ల క్రితం అనగా 2019లో రఘునాథ్, జయశ్రీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో రఘునాథ్ తన మీద చేయి చేసుకున్నాడని జయశ్రీ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ భార్య.. మహాలక్ష్మిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్త రఘునాథ్తో అఫైర్ ఉందని.. అందుకే ఆమె మొదటి భర్త అనిల్.. మహాలక్ష్మి నుంచి విడిపోయాడని ఆరోపించింది.
జయశ్రీ నటి, డ్యాన్సర్ మాత్రమే కాక కొరియోగ్రాఫర్ కూడా. ఇక భర్త అరెస్ట్ సందర్భంగా జయశ్రీ.. తన భర్త రఘునాథ్.. కొన్ని నెలలుగా మహాలక్ష్మితో రిలేషన్లో ఉన్నాడని.. తన ముందే ఆమెకు వీడియో కాల్స్ చేసి ఆమెతో మాట్లాడేవాడని ఆరోపించింది. అంతేకాక మహాలక్ష్మికి అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగి.. ఓ కుమారుడు ఉన్నాడని.. కానీ ఆ పిల్లాడు.. తన భర్తను నాన్న అని పిలుస్తున్నానడంటూ గతంలో జయశ్రీ ఆరోపించడం సంచలనంగా మారింది. కొంత కాలం నుంచి విడాకులు ఇవ్వాల్సిందిగా భర్త తనను వేధించాడని ఆరోపించింది.
మహాలక్ష్మి-రవీందర్లు వివాహం చేసుకున్న నేపథ్యంలో గతంలో జయశ్రీ.. మహాలక్ష్మి గురించి చేసిన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిని మహాలక్ష్మి అప్పుడే కొట్టి పారేసింది. జయశ్రీ తన జీవితంలో అనేక ఇబ్బందులు సృష్టించిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాత రవీందర్ మహాలక్ష్మికి ఎంతో మేలు చేశాడని.. ఆయన వల్లే ఆమె సమస్యల నుంచి బయటపడగలిగిందని.. మహాలక్ష్మి సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన అవగాహన, ప్రేమ కారణంగానే మహాలక్ష్మి, రవీందర్ను వివాహం చేసుకుందని తెలిపారు.
ఇక డబ్బు కోసమే తాను రవీందర్ను వివాహం చేసుకున్నానంటూ వస్తోన్న విమర్శలపై మహాలక్ష్మి స్పందించింది. తాను నెలకు 3 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నానని.. డబ్బు కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తామిద్దరం ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టామని వెల్లడించింది. అందుకు తగ్గుట్టుగానే ఈ జంట ట్రోలింగ్ని లెక్క చేయకుండా.. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సందడి చేస్తుంటారు.