దేశంలో ఇప్పుడు మంచి ఉద్యోగావకాశాలు పొందాలంటే చదువు ఎంతో ముఖ్యం. ఎంతో గొప్ప విజ్ఞానం, ప్రతిభ ఉన్నప్పటికీ చదువుకునేందుకు సరైన వసతులు లేక అవకాశాలు రాక పేద విద్యార్థులు చదువు మద్యలోనే ఆపేస్తుంటారు. మంచి ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదవలేకపోతున్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఎల్ ఐసీ స్కాలర్ షిప్ ద్వారా అందిస్తుంది. ఎల్ఐసీ తన అనుబంధ విభాగం అయిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘విద్యాధన్’స్కారల్ షిప్ పేరుతో అర్హత ఉన్న విద్యార్థులకు అందిస్తుంది.
లైఫ్ ఇన్సురెన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి పోస్ట్ గ్రాడ్యూయేట్ ఫస్ట్ ఇయర్ అభ్యసిస్తున్న విద్యార్థులకు వారి అర్హతను బట్టి అంటే ముందు తరగతిలో వారు ఖచ్చితంగా 60శాతం మార్కులు పొందగలిగి ఉంటే విద్యాధన్ స్కాలర్షిప్ అర్హులవుతారు. అదే విధంగా విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం మినిమం రూ.3,60,000 ఏమాత్రం మించకుండా ఉండాలని పేర్కొంది.
ఆసక్తి గల అభ్యర్థులు అర్హత ఉంటే.. ఆన్ లైన్ పద్దతిలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.