మహేంద్రసింగ్ ధోని.. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు.. వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ కూడా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మ్యాచ్లో చివర్లో ఎంత ఒత్తిడి ఉన్నా, అవసరమైన రన్రేట్ భారీగా ఉన్నా కూడా.. ధోని క్రీజ్లో ఉన్నాడంటే ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అనేక సార్లు ధోని ఇలాంటి సందర్భాల్లో టీమిండియాతో పాటు ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తన మార్క్ ఫినిషింగ్తో విజయాలు అందించాడు.
కానీ.. అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్లో ఆడుతున్న ధోని నుంచి అలాంటి సూపర్ ఫినిషింగ్ను చూడలేదు. ధోని పని అయిపోయిందనే విమర్శలు కూడా వినిపించాయి. కానీ.. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. చివరి ఓవర్ చివరి 4 బంతుల్లో CSK గెలుపు కోసం 16 పరుగులు అవసరమయ్యాయి. ముంబై తమదే విజయం అని ఫిక్స్ అయిపోయింది. కానీ క్రీజ్లో ఉంది ధోని అన్న విషయం మాత్రం వాళ్లలో ఒకింత ఆందోళన మాత్రం ఉంది. వారి భయమే నిజమైంది.చివరి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన ఉనద్కట్.. తర్వాతి బంతికి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మూడో బంతికి ఎంఎస్ ధోనీ స్టైయిట్గా సిక్స్ బాదాడు. రెండో బంతికి బ్యాక్ సైడ్ ఫోర్ బాదాడు. 5వ బంతికి 2పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన దశలో ధోనీ.. లాంగ్ ఆన్లో ఫోర్ బాది మ్యాచ్ గెలిపించాడు. దీంతో తనలోని ఫినిషర్ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. ధోనీ 3ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 13 బంతుల్లో 28 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ సీజన్లో చెన్నై రెండో గెలుపు నమోదు చేయగా.. ముంబై వరుసగా ఏడో ఓటమిని చవిచూసింది. మరి ధోని ఫినిషింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలి
Cool,Calm and compose.
Finally Dhoni finishes off his style 🔥 pic.twitter.com/i730Jgr1fg— Sherlòck🫀 (@Valar_Dohaeeris) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.