ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం(ఏప్రిల్ 23) కోల్కతా నైట్రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచులో కేకేఆర్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్(4/5) బౌలింగ్తో చెలరేగాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. దాంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా(49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్(7), టీమ్ సౌథీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. మరో ఓపెనర్ వృద్దిమాన్ సాహా(25)తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆ తర్వాత ధాటిగా ఆడిన ఈ జోడీని ఉమేశ్ యాదవ్ విడదీసాడు. తరువాత క్రీజులోకి డేవిడ్ మిల్లర్ రెండు సిక్సర్లతో చెలరేగేలా కనిపించినా.. శివం మావి అతన్ని ఔట్ చేసి గుజరాత్ ని కోలు కోలేని దెబ్బతీసాడు. ఆ మరుసటి ఓవర్లలోనే హార్దిక్ పాండ్యా సైతం ఔటవ్వడంతో పరుగుల వేగం తగ్గింది. రషీద్ ఖాన్ను టీమ్ సౌథీ ఔట్ చేయగా.. ఆండ్రీ రస్సెల్ తన ఆఖరి ఓవర్లో నాలుగు వికెట్లు తీసాడు. ఆ ఓవర్లో భారీ షాట్లకు అభినవ్ మనోహర్, లాకీ ఫెర్గూసన్, రాహుల్ తెవాటియా(17), యశ దయాల్(0) ఔటవ్వడంతో గుజరాత్ 156 పరుగులకే కుప్పకూలింది.
Andre Russell joins Amit Mishra and Yuzvendra Chahal in this elite group 🤩💯#IPL #IPL2022 pic.twitter.com/R6mxzaAWT3
— Sportskeeda (@Sportskeeda) April 23, 2022
Andre Russell in last over 😝🤣#KKRvGT pic.twitter.com/Zvz9meL9HF
— Harsh Mishra.. (@iamharsh55) April 23, 2022
ఇది కూడా చదవండి: నో బాల్ వివాదంపై చర్చ! ఆ రోజు ధోని చేసింది కరెక్టయితే ఇవాళ పంత్ చేసింది కరక్టే!