కొంతమంది ఏ పని చేసిన కలిసి రాకపోతే స్వామీజీల వద్దకు వెళ్లడమో, గుళ్లోకి వెళ్లి భగవంతున్ని ప్రసన్నం చేసుకోవడమో చేస్తుంటారు. ఉద్యోగం కావాలనో, వ్యాపారం వృద్ధి చెందాలనో వివిధ రకాల పూజలు చేస్తుంటారు. అలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారు ఇలా చేస్తే వారు సమస్యల నుంచి బయటపడొచ్చు.
కొంతమంది ఏ పని చేసిన కలిసి రాకపోతే స్వామీజీల వద్దకు వెళ్లడమో, గుళ్లోకి వెళ్లి భగవంతున్ని ప్రసన్నం చేసుకోవడమో చేస్తుంటారు. ఉద్యోగం కావాలనో, వ్యాపారం వృద్ధి చెందాలనో వివిధ రకాల పూజలు చేస్తుంటారు. అలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారు ఇలా చేస్తే వారు సమస్యల నుంచి బయటపడొచ్చు.
ఎవరికైతే లక్ష్మీ కటాక్షం ఉండదో వారు ఎంత సంపాధించినా కూడా నిలకడగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఖర్చులతో నష్టాలు భరిస్తూ ఉంటారు. వీరి కోసం ఓ చక్కటి పరిష్కార మార్గం ఉన్నది. మే 31 నిర్జల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలిసి వస్తాయని చెబుతుంటారు. అసలు ఆ నిర్జల ఏకాదశి ప్రత్యేకత ఏంటి, దానిని ఎలా ఆచరించాలో ఇప్పుడు చూద్దాం.
మే 31 ‘నిర్జల ఏకాదశి’
నిర్జల ఏకాదశి జేష్ఠ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ ఏడాది మే 31వ తేదీన నిర్జల ఏకాదశి సంబవిస్తుంది. అయితే ఇది మే 30 వ తేదీన మధ్యాహ్నం 1:32 నిమిషాలకు ప్రారంభమై, మే 31వ తేదీ మధ్యాహ్నం 01:36 నిమిషాలకు ముగిస్తుంది. అయితే పంచాంగం ప్రకారం ఏదైనా ఉదయం వచ్చిన తిధిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మే 31వ తేదీని నిర్జల ఏకాదశి జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. ఈ కారణం చేతనే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు.
లక్ష్మీదేవికి అర్చన..
కుటుంబంలో కష్టాల పాలవుతున్న వారు నిర్జల ఏకాదశి రోజు ( మే 31) భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ ప్రత్యేకమైన రోజున నిష్టతో ఉపవాసం చేస్తే పాపాల నుండి మోక్షం లభిస్తుందని అంటుంటారు. నిర్జల ఏకాదశి పొద్దున్నే నిద్ర లేచి తలస్నానం చేసి విష్ణు మూర్తిని పూజించాలి. విష్ణు పూజలో తులసిని, పసుపును సమర్పించాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ పరిపూర్ణం అవ్వదు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్జల ఏకాదశికి అక్షయ తృతీయ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు. ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తారో వారికి సకల భాగ్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు.
ఈ ప్రత్యేకమైన రోజున చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. ఈ కారణం చేతనే దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఉపవాసం చేసిన మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. ఈ రోజు చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్యం వస్తుందని అంటుంటారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ విధంగా నిర్జల ఏకాదశిని పాటించి జీవితంలో బోగ భాగ్యాలు గడించి సంతోషంగా ఉండవచ్చును.