భారతదేశం మెుదటి నుంచి ఆధ్యాత్మిక దేశంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అలాగే మన దేశం సనాతన హిందూ సంప్రదాయానికి పుట్టినిల్లు కూడా. అందులో భాగంగానే భారతీయులు దేవుళ్ళను నమ్మి పూజిస్తారు. దానికి బలమైన రుజువు మన దేశంలో ఉన్న దేవాలయాలే. ఈ క్రమంలోనే దేవాలయాల్లో కొన్నిఆశ్చర్య పరిచే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనే వరంగల్ లో ఉన్న భద్రకాళి ఆలయంలో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వరంగల్.. పురాతన దేవాలయాలకు నెలవు. అక్కడి పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలను కాకతియులు నిర్మించారు. ఆ శిల్పకళను చూస్తే అబ్బురపడాల్సిందే. కాకతీయులు శిల్పకళకు ప్రియులు.. అందులో భాగంగానే అనేక దేవాలయాలను వారి సామ్రాజ్యంలో నిర్మించారు. ఇక భద్రకాళి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో ఒకటి. నిత్యం అక్కడికి వేలల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం భద్రకాళి అమ్మవారికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పూజారులు అమ్మవారికి ప్రతీరోజు పసుపు, కుంకుమ, పాలతో జలాభిషేకాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ శుక్రవారం కూడా చేశారు. కానీ ఇక్కడే ఓ అద్బుత దృశ్యం కనిపించింది. మెుదటగా అమ్మవారికి పాలతో అభిషేకం చేశారు.. అప్పుడు అమ్మవారి కళ్ళు ముసుకున్నట్టు కనిపించింది. తర్వాత నీళ్ళతో అభిషేకించగానే కళ్ళు తెరుచుకుంటుంది. మళ్ళీ పసుపు జలాలతో అభిషేకించగానే కళ్ళు ముసుకున్నట్లు ఉన్న ఓ వీడియోని ట్వీటర్ లో ఓ భక్తుడు పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. ఇది అమ్మవారి లీల అని కొందరు అంటుంటే.. మరికొందరేమో అప్పటి శిల్పకళా నెపుణ్యంగా భావిస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
How divine to witness Warangal Bhadrakali amman’s eyes opens & closes during Abhishekam..
Friday’s blessings 🙌 pic.twitter.com/48hrRRgSw1— Anu Satheesh 🇮🇳 (@AnuSatheesh5) August 11, 2022