స్టేజిపై డ్యాన్స్ చేస్తూ ఉన్న నమిత ఉన్నట్టుండి కిందపడిపోయింది. అది గమనించిన అక్కడి వారు ఆమెను ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు.
ఈ మధ్య కాలంలో హఠాన్మరణాలు బాగా పెరిగిపోయాయి. డ్యాన్స్లు చేస్తూ.. ఆటలు ఆడుతూ జనం కుప్పకూలుతున్నారు. అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం గుండెపోటులు కాక, మిగిలినవి అనుమానాస్పద మరణాలు. అనుమానాస్పద మరణాల్లో అవి ఆత్మహత్యలు కావచ్చు.. హత్యలు కూడా కావచ్చు. తాజాగా, ఓ బాలిక స్టేజిపై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని మైసూర్కు చెందిన నమిత అనే యువతి పట్టణంలోని టి.నరసిపురలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె చదువులోనూ.. కల్చరల్ యాక్టివిటీస్లోనూ ఎంతో యాక్టివ్గా ఉండేది. తాజాగా, కాలేజ్లో జరిగిన ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్లో యువతి పాల్గొంది.
ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నమిత ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నమితను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతిది సాధారణ మరణమా లేక వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.