ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఎవ్వరం కూడా ఊహించలేము. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ప్రమాదాలభారిన పడి కుటుంబసభ్యులకు దుఖాన్ని మిగుల్చుతున్నారు. హఠాత్తుగా జరిగే ఈ ప్రమాదాలతో జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంటుంది.
ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఫోటోషూట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలను జీవితంలో గుర్తిండిపోయే విధంగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీనికోసం సుందరమైన ప్రదేశాలకు వెళ్లి ఫొటోషూట్లలో పాల్గొంటున్నారు. ఖర్చు ఎంతైనా లెక్కచేయకుండా ఇలా ఫొటో షూట్లు చేయించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే స్థితికి తెచ్చుకుంటున్నారు. ఇదే తరహాలో నూతనంగా పెళ్లైన ఓ జంట హనీమూన్ కోసం వెళ్లి ప్రమాదభారిన పడిన ఘటన చోటుచేసుకుంది.
యువతీ యువకులు పెళ్లి చేసుకుని కోటి ఆశలతో, కొత్త బాధ్యతలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎదుర్కొని ఆనందంగా గడపడానికి మొగ్గుచూపుతారు. ఇదే విధంగా ఓ జంట నూతనంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ విధి ఎక్కిరించింది. నెలతిరగకుండానే వారి జీవితాల్లో విషాదం అలుముకుంది. కాగా ఆ జంట హనీమూన్ కు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన వైద్యురాలు విభూషిణియా, చెన్నైకు చెందని లోకేశ్వరన్ వైద్యుడు అంగరంగ వైభవంగా జూన్ 01న పెళ్లి చేసుకున్నారు.
ఈ క్రమంలో హనీమూన్ కోసం ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇండోనేషియాలోని బాలీ దీవికి వెళ్లారు. అక్కడ సంతోషంగా గడుపుతూ ఈ నెల 09న సముద్రంలో బోటు రైడింగ్ కు వెళ్లారు. బోట్ రైడ్ షూట్ చేసే క్రమంలో అదుపుతప్పి సముద్రంలో పడిపోయారు. దీంతో నవదంపతులు ఇద్దరు మరణించారు. ప్రమాదానంతరం మృతదేహాలను బయటకు తీశారు. జరిగిన విషాదం గురించి అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హనీమూన్ కోసం వెళ్లిన జంట అర్థాంతరంగా చనిపోవడంతో ఇరు కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.