పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి గనిలో ఘోర ప్రమాదం జరిగింది. రామగుండంలోని ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించినట్లు తెసుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పూర్తి వివరాలలు తెలియరాలేదు. అధికారికంగా ప్రస్తుతం నలుగురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ మేనేజర్ తేజతో పాటు మరో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. హఠాత్తుగా పైకప్పు కూలడంతో పెద్ద బండరాళ్లు కార్మికులపై పడ్డాయి. దీంతో వీటి కింది చిక్కుకుని కార్మికులు మరణించినట్లుగా స్థానిక సమాచారం. ప్రస్తుతం సింగరేణి రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ చేస్తున్నారు.