పాకిస్తాన్ లో షెషావర్ పట్టణంలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. షెషావర్ లోని కిస్సా ఖ్వానీ బజార్ లో ని ఓ మసీదుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఓ ఉగ్రవాది ప్రవేశించాడు. అక్కడ అందరు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందారు.మరో 50 మందికి తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వీరిలో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగి జరిగిన భారీపేలుడు ధాటికి మసీదు తీవ్రగా దెబ్బతిన్నది.ఈ ఘటనకు సంబంధించింది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
قصہ خوانی بازار کے کوچہ رسالدار شیعہ جامع مسجد میں دو حملہ آور نے گھسنے کی کوشش کی
ڈیوٹی پر موجود پولیس اہلکاروں پر فائرنگ ہوئی ہے
فائرنگ سے ایک پولیس جوان شہید جبکہ دوسرا زخمی ہوا ہے جس کی حالت تشویشناک ہے
پولیس ٹیم پر حملہ کے بعد جامع مسجد میں دھماکہ ہوا ہے
1/2 pic.twitter.com/9gwfHSsPuG
— Capital City Police Peshawar (@PeshawarCCPO) March 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.