ఒకప్పుడు వరకట్న వేధింపుల కారణంగా ఎందరో మహిళలు ఆత్మహత్యలు చేసుకునేవారు. నేటి కాలంలో అలాంటి వరకట్న వేధింపులు చాలా వరకు తగ్గాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా అలాంటి వేధింపులను కొందరు మహిళలు ఎదుర్కొంటున్నారు. ఆ టార్చర్ భరించలేక వారి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ నవ వధువుకు పెళ్లైన కొన్ని నెలలకే అత్తింటి వారి నిజస్వరూపం తెలిసింది. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని అర్ధాంతరం ముగించింది. ఈఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా హాలియా మండలంలోని కొర్రివేని గూడెం గ్రామానికి చెందిన సీతా లక్ష్మయ్య, విజయ దంపతుల చిన్న కుమార్తె కావ్య(22)ను ఏడు నెలల క్రితం నేతాపురం గ్రామానికి చెందిన బొల్లెంపల్లి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల కుమారుడు మహేష్ కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నం కింద రూ.2 లక్షలు, ఆరు తులాల బంగారం, అర ఎకరం పొలం ఇచ్చారు. ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగు పెట్టింది కావ్య. కొత్తలో అత్త,మామ, భర్త చూపించే ప్రేమలకు చాలా సంతోష పడింది. అలా కొన్ని నెలల పాటు ఆమె కొత్త కాపురం సాఫీగా సాగింది. ఇక అత్తంటి వారు తమ నిజస్వరూపం చూపించారు. కొద్ది నెలలుగా కావ్యను భర్త మహేష్తో పాటు అత్తా, మామలు సూటిపోటి మాటలతో శారీరకంగా, మానసికంగా వేధించసాగారు.
ప్రస్తుతం కావ్య 5 నెలల గర్భవతి. అయినా కూడా అత్తింటి వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఈనెల 4న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న కావ్య మంగళవా రం మృతిచెందింది. కావ్య.. తండ్రి సీతా లక్ష్మ య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.