తమిళనాడులోని తిరుపూరు కేంద్రంగా రామ్రాజ్ కాటన సంస్థ పంచెలు, చొక్కాలు, మాస్కులు, లోదుస్తుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఆ ఉత్పత్తులకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణా, కేరళ రాష్ట్రాల్లో మంచి జనాదరణ ఉంది. కరోనా నుంచి ప్రజలకు తగిన రక్షణ కల్పించేలా నాణ్యమైన మాస్కులు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నది. గత నెలలో ఆంధ్రప్రదేశలో రామ్రాజ్ సంస్థ మాస్కుల విక్రయాలు భారీగా తగ్గిపోవటాన్ని గుర్తించి, దానికి తగిన కారణాలను అన్వేషించింది. రామ్రాజ్ కాటన్ సంస్థ ముద్రతో నకిలీ మాస్కులు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు సంస్థ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
తమిళనాడులోని తిరుప్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న రామ్రాజ్ కాటన్ సంస్థ పంచె, చొక్కా, మాస్కులు, లోదుస్తుల ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మాస్కుల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దీనిపై విచారించినప్పుడు కావలి, ఒంగోలు పట్టణాలకు చెందిన కొంతమంది రామ్రాజ్ కాటన్ సంస్థ ముద్రను ఉపయోగించి నకిలీ మాస్కులు తయారుచేసి భారీగా విక్రయిస్తున్నట్లు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు బండ్లమిట్టకు చెందిన ఒక టెక్స్టైల్స్ సంస్థ యజమాని డీ. రాజా నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా నకిలీ మాస్కులు ఒంగోలులో తయారు చేసి అక్కడ నుంచి కావలికి సరఫరా చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో కావలి పోలీసులు ఒంగోలుకు చేరుకుని డీ. రాజాను కూడా అరెస్ట్ చేసి, ఆయన వద్ద ఉన్న నకిలీ మాస్కులను స్వాధీన పరుచుకున్నారు. కరోనా నుంచి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా మూడు పొరల మాస్కులను రామ్రాజ్ సంస్థ తయారుచేస్తుంది. నాణ్యమైన ఈ మాస్కులను సంస్థ షోరూములు, అనుమతులు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలి. నకిలీల మాయలో పడి మోసపోవద్దని కాటన్ వ్యవస్థాపకులు కె.ఆర్.నాగరాజన్ రామ్రాజ్ విజ్ఞప్తిచేశారు.