స్త్రీకి మన వేదాల్లో విశేష స్థానం ఇచ్చారు. అంత ఎందుకు సృష్టి మొత్తానికి కారణమైన ఆదిశక్తిని కూడా స్త్రీ శక్తి స్వరూపంగా కొలుస్తున్నాము. అంతటి ఈ వేద భూమిపై నివశిస్తున్న కొంతమంది మహిళలు.. మొత్తం స్త్రీ జాతికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ విచిత్ర వార్త ఇది. అది ఉత్తరప్రదేశ్లోని హరిపర్వత్ ప్రాంతం. అక్కడి కలర్ ల్యాబ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. తలపై బలంగా కొట్టడంతో అతను చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. చనిపోయింది జస్రానాకు చెందిన రాజేంద్ర యాదవ్గా గుర్తించారు. అతనికి భార్య జెమవ్, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భర్త హత్య విషయంలో పోలీసులు భార్యని ప్రశ్నించారు. ఫలితం లేకపోయింది. ఆమె అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండటంతో ఆమెని వదిలేశారు పోలీసులు. తరువాత మృతుడి కాల్ లిస్ట్ ద్వారా అన్నీ ప్రయత్నాలు చేశారు. సుమారు 100 మందిని విచారించారు. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ.., మృతుడి బాడీ పడేసిన ప్రదేశంలో స్మార్ట్ సిటీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఓ వ్యక్తి అనుమానంగా తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని సిర్సిరా గ్రామానికి చెందిన రాజు అలియాస్ సుఖ్దేవ్గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేయడంతో పోలీసులకి సైతం కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలిశాయి.
నేను.. జెమవ్ ప్రేమించుకున్నాము. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము. దీనికి.. జెమవ్ భర్త రాజేంద్ర అడ్డుగా నిలిచాడు. జెమవ్ కి రాజేంద్ర మొదటి భర్త కాదు. ఆమెకి ఇప్పటికే 7 పెళ్లిళ్లు అయ్యాయి. రాజేంద్ర 7వ భర్త. అలాంటపుడు అతను అడ్డు ఎలా చెప్తాడు? అందుకే.. నేను, జెమవ్ కలసి రాజేంద్రని తలపై సిలెండర్ తో కొట్టి హత్య చేశామని సుఖ్దేవ్ నిజాలని ఒప్పుకున్నాడు. మరోవైపు జెమవ్ కూడా అన్నీ నిజాలను పోలీసుల విచారణలో వెల్లడించింది. ఎనిమిదో పెళ్లి చేసుకోవాలన్న ఆశతోనే ఈ పని చేశానని జెమవ్ చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ప్రేమికులు ఇద్దరూ జైలులో ఊసలు లెక్క పెడుతున్నారు. మరి.., ఇలాంటి మహిళలకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.