Sathya Sai: ప్రియుడిని కలిసి పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్లిన ఓ యువతి రేకుల షెడ్డులో శవమై తేలింది. ఈ సంఘటన సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల పట్టణానికి చెందిన తేజశ్విని తిరుపతిలో బీఫార్మసీ చదువుతోంది. ఆమె ఉండే వీధిలోనే నివాసం ఉంటున్న సాధిక్తో తేజశ్విని ప్రేమలో పడింది. ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాధిక్ మల్లపల్లి సమీపంలో ఓ ఇటుక బట్టీ నడుపుతున్నాడు. అక్కడే ఓ రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాడు. సాధిక్ అక్కడ ఉన్నాడని తేజశ్విని తెలుసుకుంది. గురువారం అక్కడికి వెళ్లింది. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే తేజస్విని తనను పెళ్లి చేసుకోవాలని సాధిక్ను కోరింది.
అతడు తన తల్లిని అడిగి వస్తానని గోరంట్లకు వచ్చేశాడు. అతను తిరిగి వెళ్లి చూసే సరికి తేజశ్విని ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తేజశ్విని మరణానికి సాధిక్కే కారణం అంటూ మృతురాలి బంధువులు గోరంట్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి సర్థి చెప్పటంతో ఆందోళన విరమించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nellore: అమానవీయ ఘటన..కుమారుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి!