Woman: నోట్ల కట్టలకోసం కొంతమంది వ్యక్తులు కట్ల పాముల్లా మారుతున్నారు. బంధాలను సైతం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ధన దాహంతో కట్టుకున్న వాళ్లను సైతం కాటికి పంపిస్తున్నారు. ఓ భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించిన ఘటనలో భార్య ప్రాణాలు తీసుకుంది. తనతోపాటు తొమ్మిది నెలల బిడ్డ ప్రాణాలను సైతం తీసుకుపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, దావణగెరె జిల్లా జగళూరు పట్టణానికి చెందిన నికితకు దావణగెరెకి చెందిన మనోజ్ కుమార్ అనే ఇంజనీర్తో ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. అతడు దావణగెరెలోని పాలికెలోల ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని నెలలు వీరి కాపురం సాఫీగా సాగింది.
వీరికి అనీశ్ అనే మగ బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత మనోజ్ తన ధన దాహాన్ని బయటపెట్టాడు. పెళ్లి సమయంలో 6 లక్షల రూపాయల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చినా అతడికి చాల్లేదు. ఇంకా డబ్బులు తేవాలని నికితను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం నిఖిత భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. నికిత తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. మంగళవారం ఉదయం వారు విధులకు వెళ్లిపోయారు. మనోజ్ వేధింపులతో విసుగు చెందిన నిఖిత ప్రాణాలు తీసుకోవాలని డిసైడ్ అయింది.
తను మాత్రమే చనిపోతే 9 నెలల బిడ్డ దిక్కులేని వాడవుతాడని భావించింది. ముందుగా బిడ్డకు ఉరివేసి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు విగత జీవులుగా పడిఉన్న ఇద్దర్నీ చూసి షాక్ అయ్యారు. గుండెలవిసేలా వెక్కివెక్కి ఏడ్చారు. సమాచారం అందుకున్న జగళూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరి, అదనపు కట్నం వేధింపులకు బలైన నికిత, అనీశ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Drug Case: అతనో డ్రగ్స్ స్మగ్లర్.. పోలీసులే కుర్చీ వేసి కూర్చో బెట్టారు.. ఎందుకంటే?..