ప్రస్తుత కాలంలో కొందరు పెళ్లైన మహిళలు భర్తతో వైవాహిక జీవితాన్ని గడపకుండా పక్కదారులు తొక్కుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా వక్రబుద్దిని చూపిస్తూ అన్నా, తమ్ముడు అనే తేడాను మరిచి వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ చివరికి అడ్డొచ్చిన భర్తను హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇది కూడా చదవండి: Karimnagar: 13 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల పెద్దాయన దారుణం.. పరిహారంగా రూ .30 వేలు!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని బార్ మేర్ కు చెందిన ఓ మహిళకు గతంలో పెళ్లైంది. కాగా భర్త వివాహ వేడుకల్లో పాటలు పాడుతూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ అన్న వరుస అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఎంచక్కా భర్తలేని సమయం చూసి ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసేది. ఇక కొన్ని రోజుల తర్వాత భార్య చీకటి కాపురం భర్తకు తెలిసింది. దీంతో భర్త కొన్ని సార్లు భార్యను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. అయినా భార్య తీరు మాత్రం మారలేదు. అయితే ఇటీవల తన భర్తతో పాటు తన ప్రియుడు కూడా పార్టీ చేసుకుందామంటూ బయటకు తీసుకెళ్లారు.
దీంతో భర్తకు ఫుల్ గా మద్యం తాగించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక తట్టుకోలేకపోయిన భార్య, ఆమె ప్రియుడు కలిసి కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం భర్తను ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి ఏం తెలియదన్నట్టుగా పరారయ్యారు. ఈ ఘటనపై భర్త సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.