వివాహేతర సంబధాలు… ఇవే సంతోషంగా సాగుతున్న సంసారంలో నిప్పులు పోస్తూ పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. పెళ్లైన మహిళలు భర్తతో ఉండలేక పరాయి సుఖం కోసం పాకులాడుతూ కోరుకున్న ప్రియుడితో లేచిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల రాజస్థాన్ లో వెలుగు చూసింది. అయితే భర్తను కాదని ప్రియుడితో లేచిపోయిన తర్వాత ఆ మహిళ భర్త ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది రాజస్థాన్ జోధ్ పూర్ జిల్లా బార్సింగో బాస్ గ్రామం. ఇక్కేడ భన్వర్ లాల్, కిష్ట అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో భన్వర్ లాల్ కాపురం సంతోషంగా సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే భనర్వర్ లాల్ భార్య భర్తను కాదని పక్క చూపులు చూసింది. విషయం ఏంటంటే? కిష్ట స్థానికంగా ఉండే మోహన్ రామ్ అనే ఆరుగురు పిల్లల తండ్రితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. కిష్టతో అక్రమ సంబంధానికి మోమన్ రామ్ కూడా సహకరించాడు. దీంతో అలా వీరి చీకటి కాపురం పురుడు పోసుకుంది. ఇక ఇంకేముంది.. వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.
ఇదిలా ఉంటే కిష్టకు తన భర్తతో కంటే ప్రియుడితో ఉండేందుకే ఇష్టపడింది. ఇక ఇందులో భాగంగానే ప్రియుడితో ఉండాలనుకున్న కిష్ట గత 6 నెలల కిందట ప్రియుడు మోహన్ రామ్ తో లేచిపోయింది. దీంతో ఖంగారుపడ్డ భర్త భన్వర్ లాల్ భార్య ఆచూకి కోసం అంతటా వెతికాడు. భార్య ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో ఆ మహిళ భర్త భన్వర్ లాల్ కు ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భనర్వలాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే కిష్ట భర్త భన్వర్ లాల్ ఫోన్ చేసి… నేను నీతో ఉండను, నా ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. భార్య అలా చెప్పడంతో భన్వర్ లాల్ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.
భార్య చేసిన పనికి సమాజంలో తన పరువు పోయిందనుకున్న భన్వర్ లాల్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని ముగ్గురు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతంర ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భన్వర్ లాల్ భార్య కిష్ట, ఆమె ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.