రెండు నెలల కిందట అనుమానాస్పద మృతిలో మరణించిన పూర్ణిమ కేసులు అసలు నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన నిజాలు ఏంటంటే?
నిజామాబాద్ జిల్లాలో గత రెండు నెలల కిందట నవ వధువు పూర్ణిమ అనుమానాస్పద మృతిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు.. భర్త వేధింపులు భరించలేక మా కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి తాజాగా అసలు నిజాలు బయటపెట్టారు. ఈ కేసులో పోలీసులు చెప్పిన అసలు నిజాలు ఏంటంటే?
అసలేం జరిగిందంటే?
నిజామాబాద్ జిల్లాలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన విశాల్ అనే వ్యక్తి హమల్ వాడికి చెందిన పూర్ణిమ అనే మహిళను రెండు నెలల కిందటే వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే భర్త కాంట్రాక్టర్ గా పని చేస్తుండగా, భార్య మాత్రం ఐటీసీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండేది. ఇలా ఈ భార్యాభర్తల కాపురం సంతోషంగానే సాగింది. కట్ చేస్తే.. ఈ నెల 2న పూర్ణిమ వారు నివాసం ఉంటున్న బిల్డింగ్ పై నుంచి కిందపడి అనుమనాస్పద స్థితిలో మరణించింది.
వెంటనే స్పందించిన మృతురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల వల్లే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా ఆమె భర్త విశాల్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని అన్ని కోణాల్లో విచారించి తాజాగా అసలు నిజాలు బయటపెట్టారు. భర్త వేధింపుల కారణంగానే పూర్ణిమ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన స్థానింకగా ఉండే సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలించినట్లుగా తెలుస్తుంది. దీనిపై స్పందించిన పూర్ణిమ తల్లిదండ్రులు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.