గుజరాత్కు చెందిన ఓ యువతి చార్టెట్ అకౌంట్స్ చదువుతోంది. ఆమెకు చెన్నైకి చెందిన జైన్తో పరిచయం ఉంది. ఓ రోజు ఆమె తనకు అనారోగ్యంగా ఉండటంతో ఈ విషయాన్ని జైన్కు చెప్పింది.
ఈ మధ్య కాలంలో అమ్మాయిల్ని మోసం చేసే మగాళ్లు ఎక్కువయిపోయారు. పరిచయం ఉన్న మగవారితో స్నేహాలు యువతుల పట్ల దారుణ పరిణామాలకు తెరతీస్తున్నాయి. తాజాగా, ఓ యువతి తెలిసిన వ్యక్తిని నమ్మి మోసపోయింది. అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఓ యువకుడు సహాయం చేస్తానన్నాడు. ఆమె నమ్మి వెళ్లగా స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ కాలేజ్లో చార్జట్ అకౌంటెన్సీ చదువుతోంది.
డిసెంబర్ నెలలో ఓ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి మధురై వెళ్లింది. ఆ సమయంలో ఆమె కొంత అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన ఆశిష్ జైన్, కథిరవన్లు కూడా మధురై వచ్చారు. వారు అక్కడి ఓ లాడ్జిలో దిగారు. జైన్కు సదరు యువతికి ముందుగానే పరిచయం ఉంది. తనకు అరోగ్యం బాగోలేని విషయం ఆమె జైన్కు చెప్పింది. ఆమె అనారోగ్యాన్ని అతడు అవకాశంగా తీసుకున్నాడు. సహాయం చేస్తానని అంటూ ఆమెను లాడ్జికి పిలిచాడు. ఆమె లాడ్జికి వెళ్లగానే ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
వాళ్లు గుజరాత్లోని పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును మధురై పోలీసులకు పంపారు. పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఏప్రిల్ 11న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాలు మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు చేస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్న నేరాలు మాత్రం ఆగటం లేదు. నిమిషాల సుఖం కోసం కొంతమంది ఇతరుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మరి, పరిచయం ఉన్న యువతిని రేప్ చేసిన ఈ ఇద్దరు వ్యక్తుల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.