hyderabad crime: వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రియుడు పెళ్లి చేసుకోవాలని బెదిరించటంతో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. స్నేహితులతో కలిసి ప్రియుడ్ని చంపించింది. ఈ సంఘటన హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని భాగ్ అంబర్పేటకు చెందిన యశ్విన్ అనే ఫొటో గ్రాఫర్కు మీర్పేట, నందీహిల్స్కు చెందిన వివాహిత శ్వేతారెడ్డితో ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరు తరుచూ ఏకాంతంగా కలిసేవారు. ఈ నేపథ్యంలో ఓ రోజు శ్వేతారెడ్డితో న్యూడ్ కాల్స్లో మాట్లాడాడు. వాటిని రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడు. ఆ న్యూడ్ వీడియోలతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఫొటోలు, వీడియోలను ఆమె బంధువులకు పంపుతానని ఒత్తిడి తేసాగాడు. ఈ నేపథ్యంలో భయపడిపోయిన శ్వేత అతడి అడ్డు తొలగించుకోవాలనుకుంది.
కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసిన కొంగల అశోక్ (28), ఎలక్ట్రీషియన్ కొత్తపల్లి కార్తీక్(30)లను రంగంలోకి దింపింది. ప్లాన్ ప్రకారం శ్వేతారెడ్డి ఈ నెల 3న యశ్విన్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. అతను అర్థరాత్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ మాటు వేసిన అశోక్, కార్తీక్లు అతడి తలపై బలంగా కొట్టారు. దీంతో యశ్విన్ స్ప్రహ కోల్పోయాడు. అతడి దగ్గర ఉన్న ఫోన్ను తీసుకురమ్మని శ్వేత వారిని కోరింది. అయితే, యశ్విన్ దగ్గర ఫోన్ కనిపించలేదు. దీంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన యశ్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతిలో ట్విస్ట్! పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని నిజాలు!