తాత కోసం ఆ మనుమడు రోజూ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెచ్చి తినిపించేవాడు. ఒకానొకరోజు ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని మనుమడు బయట ఎవ్వరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఫ్రిజ్లో కుక్కాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేసి చూడి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. బాలయ్య మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవడంతోనే ఫ్రిజ్లో పెట్టానని మనవడు స్థానికులకు, పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డిలో ఉన్న బాలయ్య దంపతులు పరకాలలో ఉంటున్న కుమారుడు హరికృష్ణ వద్దకు చేరారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు కుమారుడు హరికృష్ణతో బాలయ్య భార్య నర్సమ్మ కూడా గత కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఇక అప్పటి నుండి హరికృష్ణ కుమారుడు నిఖిల్ తో కలిసి బాలయ్య పరకాలలోనే నివాసం ఉంటున్నాడు. ఇటివల బాలయ్యకు పక్షవాతం సోకడంతో ఆయనకు సేవలు చేయడంతో పాటు తనకు ఎవరు లేరనే మానసిక వేదనతో నిఖిల్ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అయిదు రోజులుగా శవం ఫ్రిజ్లో పెట్టడడంతో దుర్వాసన మొదలైంది.
ఈ క్రమంలోనే కాంప్లెక్స్ యజమాని నిఖిల్ను ప్రశ్నించడంతో ఎలుక చచ్చిపోయిందని కవర్ చేశాడు. కాని వాసన విపరీతంగా రావడంతో కాంప్లెక్స్ యజమాని నేరుగా వెళ్లి ఇంట్లో ఉన్న ఫ్రీజ్ను తెరిచి చూడడడంతో శవం బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని బాలయ్య శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అనంతరం మృతిపై అనుమానాలు ఉండడంతో నిఖిల్అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాని నిఖిల్ మాత్రం డబ్బుల లేకపోవడంతోనే శవాన్ని దాచిపెట్టానని చెబుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.