సరదాగా చేసే కొన్ని పనులు లేని పోని చిక్కులను తెచ్చిపెడతాయి. ఊహించని ప్రమాదాలకు కారణమవుతాయి. ఇదే విధంగా కొందరు స్నేహితులు సరదాగా పందెం వేసుకుని విషాద ఘటనకు కారణమయ్యారు.
ఫ్రేండ్ షిప్ అనేది అధ్భుతమైన అనుభూతి. వయసుతో సంబంధం లేకుండా వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది. కష్ట సుఖాల్లో స్నేహ బంధం తోడుంటుంది. తమ జీవితాల్లో ఎదురయ్యే బాధలను అయిన వారికంటే ఎక్కువగా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటారు. ఇక నలుగురు స్నేహితుల కలిసి ఒకదగ్గర చేరారంటే ఆ సరదానే వేరు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, ఆటపట్టిస్తూ ఆనందంగా గడుపుతుంటారు. ఇదే విధంగా ఓ దగ్గర స్నేహితులందరూ కలుసుకున్నారు. సరదాగా ఓ పందెం వేసుకున్నారు. కానీ ఆ పందెమే వారి జీవితాల్లో విషాదాన్ని నింపుతుందని పసిగట్టలేకపోయారు. పందెంలో 150 మోమోలు తిని ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. సాదారణంగా అతిగా మధ్యం సేవిస్తే ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మోమోలు తిని మరణించిన దాఖలాలు లేవు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లాలో కొందరు స్నేహితులు సరదాగా బయటికి వెళ్లారు. అందులో విపిన్ అనే యువకుడు తన స్నేహితులతో సరదాగా పందెం కాసాడు. ఆ పందెమే అతని పాలిట శాపమైంది. విపిన్ అనే యువకుడు స్నేహితులతో కలిసి మోమోలు తినే పందెం కాసిండు. ఆ పందెంలో 150 మోమోలు తిని అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సరదాగా కాసిన పందెం ఆ యువకుడి ప్రాణాలు తీసింది. మరోవైపు విపిన్ తల్లి దండ్రులు తమ కుమారునికి స్నేహితులే విషం పెట్టి చంపారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత యువకుడి మరణానికి గల విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.