ఈ మధ్యకాలంలో కొందరు ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం భావిస్తున్నారు. కుటుంబ, ఆర్థిక, ఇతర బయటి సమస్యలకు భయపడిపోయి.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అయితే అభంశుభం తెలియని తమ పిల్లలను సైతం చంపి.. వారు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు మన నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఆరేళ్ల కుమారుడితో కలిసి ఓ తండ్రి అందరూ చూస్తుండగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు కొన్ని క్షణాల పాటు షాక్ కి గురయ్యారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ముంబైలో ఉల్హాస్ నగర్ పరిధిలోని శాంతినగర్ ప్రాంతంలో ప్రమోద్ అదాలే అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం తన ఆరేళ్ల కుమారుడు స్వరాజ్ తో కలిసి విఠల్ వాడి రైల్వే స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ కొద్ది సేపు కుమారుడితో పాటు కూర్చుకున్నాడు ప్రమోద్ అదాలే. అనంతరం కొడుకుతో కలిసి ఫ్లాట్ ఫామ్ పై తిరుగుతూ… అందరూ చూస్తుండగా కొడుకును పట్టుకొని.. ముంబై నుంచి పూణే వైపు వేగంగా వెళ్తున్న దక్కన్ ఎక్స్ ప్రెస్ రైలు ముందు పట్టాలపై దూకేశాడు. ఈ ప్రమాదంలో ప్రమోద్ శరీరం ఛిద్రమైంది. పట్టాల మధ్య పడిపోవడంతో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం రుక్మిణి బాయి ఆస్పత్రికి తరలించారు. పిల్లాడిని అతడి తల్లికి అప్పగించారు. ప్రమోద్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.