ప్రియుడ్ని నమ్మి అతడి ఇంటికి వెళ్లిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. తన స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె ప్రియుడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ప్రియుడి ఇంట్లోనే విషం తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, మల్కాన్గిరి జిల్లాలోని మల్కాన్ గిరి సమితి, బప్పన్పల్లి గ్రామానికి చెందిన బబిత, మత్తిలి సమితి, పూరణగుడకు చెందిన గుప్త బారల్ గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. గత గురువారం ఉదయం ఇంట్లో చెప్పి, ప్రియుడి ఇంటికి బయలుదేరింది.
అక్కడ ప్రియుడు, అతడి స్నేహితులు బబితపై అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బబిత గుప్త ఇంట్లోనే విషం తాగింది. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మత్తిలి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మల్కన్గిరికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బబిత చనిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గుప్త, అతడి స్నేహితులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇండస్ట్రీలో దారుణం.. ప్రముఖ నటిపై అత్యాచారం!