Bride: దొంగ పెళ్లి కూతుర్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువయిపోతున్నాయి. డబ్బుల కోసం పెళ్లిళ్లు చేసుకుని, కొన్ని రోజుల్లోనే తమ పాడు బుద్ధిని బయపెడుతున్నారు. తాజాగా, రాజస్తాన్లో ఓ యువతి పెళ్లయిన 12 రోజులకే భర్తను వదిలి పరారైంది. ఇంట్లోంచి పారిపోతూ భర్త చెల్లెల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, పుష్కర్కు చెందిన 27 ఏళ్ల యధు అనే వ్యక్తికి జార్ఖండ్ జుమ్మా రామ్ఘర్కు చెందిన 28 ఏళ్ల పూజతో మే 27వ తేదీన పెళ్లయింది. జూన్ 10వ తేదీన యధు పని మీద ఇంటినుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి వచ్చి చూస్తే భార్య, 13 సంవత్సరాల చెల్లెలు కనిపించలేదు.
అతడి అమ్మానాన్నలు శశి బాల, దయా ప్రకాశ్లు ఇంట్లోని ఓ గదిలో లాక్ చేసి ఉన్నారు. పూజ, బాలిక కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారు కనిపించలేదు. పూజతో పాటు ఆమెకు కానుకగా ఇచ్చిన 5 తులాల బంగారం, ఓ మొబైల్ ఫోన్, కెమెరా కూడా కనిపించకపోవటంతో యధుకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్ దీనిపై ఫిర్యాదు చేశాడు.
జార్ఖండ్కు చెందిన పంకజ్ కుమార్ అనే మధ్యవర్తి ద్వారా పూజ సంబంధం వచ్చిందని, ఇందుకోసం 3.50 లక్షల రూపాయలు అతడికి ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూజ, సదరు బాలిక జార్ఖండ్ వెళ్లుంటారని పోలీసులు భావిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Designer Prathyusha: అన్నీ ఉన్నా ఏదో లోటు.. ప్రత్యూష ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి?..