వాళ్లిద్దరు భార్యాభర్తలు. అప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు, తిట్టుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. వీరి సంసారాన్ని చూసి పగోడు కూడా ఈర్ష్య పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సంసారంలో ఒక్కసారిగా గొడవలు, మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే భార్యభర్తలు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కట్ చేస్తే పచ్చని కాపురం నిట్టనిలువునా కూలిపోయింది. అద్భుతంగా గడిచిన ఈ దంపతుల దాంపత్య జీవితం ఎందుకు ఇలా అయింది? దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని శివమొగ్గ ప్రాంతం. ఇక్కడే దినేష్, మంజుల అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అప్పటి వరకు వీరి సంసారం ఎంతో ఘనంగా సాగుతుంది. మనస్పర్ధలు లేవు, గొడవలు పడ్డ దాఖలాలు లేవు. అలాంటి వీరి పచ్చని కాపురంలో ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏ విషయంలో గొడవ పడ్డారో ఏమో తెలియదు కానీ.. గత కొన్ని రోజుల నుంచి ఈ భార్యాభర్తల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి భార్యాభర్తల నడుమ మరోసారి గొడవ రాజుకుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు, గొడవ పతాక స్థాయికి చేరింది.
ఇక బుధవారం తెల్లవారు జామున భర్త దినేష్ కు ఎక్కడ లేని కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడంతో వంటగదిలో కత్తితో భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం బెడ్ రూంలోకి వెళ్లిన దినేష్ అదే కత్తితో తన చెయి కోసుకున్నాడు. గమనించిన స్థానికులు వారి ఇంట్లోకి వచ్చి చూడగా.. మంజుల వంట గదిలో రక్తపు మడుగులో పడి ఉండగా, భర్త బెడ్ రూంలో చేయి కోసుకుని ఉన్నాడు. వెంటనే అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంజుల మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.