స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశీయ బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ఇందులో నూటికి తొంబై శాతం మందికి ఖాతాలు ఉండే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ వార్త. ఈమధ్యన ఎస్బీఐ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు మెసేజ్లు వెళుతున్నాయి. అయితే తాము ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా డబ్బులు ఎందుకు డెబిట్ అవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వాస్తవేమే అయినప్పటికీ.. ఎందుకు కట్ అయ్యాయి..? కారణమేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వార్షిక నిర్వహణ రుసుము కింద డబ్బులు కట్ అయినట్లు బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. ఎస్బీఐ కస్టమర్లు ఉపయోగించే డెబిట్ కార్డ్ల యాన్యువల్ ఫీ రూ.125 ఉండగా.. అదనంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోంది. దీంతో రూ.125కి జీఎస్టీ (18% = రూ. 22.5) కలిపితే రూ.147.50కి అవుతుంది. ఈ సర్వీస్ ఛార్జీ అనేది ఏడాదికోసారి వసూలు చేస్తుంది. అలాగే, యువ, గోల్డ్, కాంబో, మైకార్డ్ లాంటి డెబిట్ కార్డులకు రూ.175+జీఎస్టీ, ప్లాటినమ్ డెబిట్ కార్డుకు రూ.250+జీఎస్టీ, ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకు రూ.350+జీఎస్టీ వసూలు చేస్తుంది. అయితే, సిగ్నేచర్, సాలరీ అకౌంట్తో లింక్ అయిన ఉన్న డెబిట్ కార్డులకు ఎలాంటి యాన్యువల్ ఛార్జీలు ఉండవు.
ఇవేకాదు ఏటీఎం కార్డుకు సంబంధించి మరిన్ని ఛార్జీలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకోండి.. డూప్లికేట్ పిన్ లేదా బ్రాంచ్లో పిన్ జనరేషన్ కోసం రూ.50+ జీఎస్టీ చెల్లించాలి. తప్పుడు అడ్రస్ కారణంగా ఏటీఎం కార్డ్ లేదా కిట్ డెలివరీ కాకపోతే రూ.100+ జీఎస్టీ చెల్లించాలి. ఈ విషయంపై మీకు ఏమైనా సందేహాలుంటే బ్యాంకు సిబ్బందిని సంప్రదించడం ఉత్తమం. ఎస్బీఐ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.