బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు పసిడి ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
పసిడి ప్రియులకు శుభవార్త. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర భారీగా పతనమైంది. ఎప్పుడూ లేని విధంగా కనిష్ట స్థాయికి పడిపోయింది. మూడు రోజుల క్రితం వరకూ 1920 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ ఇప్పుడు భారీగా పతనమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1893.81 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1908 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ 15 డాలర్ల మేర పడిపోయింది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 54,550 వద్ద ఉండగా ఇవాళ ఉదయం రూ. 100 తగ్గింది. ట్రేడ్ మొదలయ్యే సరికి మరో రూ. 350 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,100 వద్ద కొనసాగుతుంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ఐతే నిన్న రూ. 59,510 ఉండగా ఇవాళ ఉదయం ట్రేడ్ మొదలవ్వక ముందు రూ. 110 తగ్గింది. ఆ తర్వాత రూ. 380 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం రూ. 59,020 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 22.49 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న 22.70 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ వెండి ఇవాళ మాత్రం పతనమైంది. దీంతో దేశీయంగా వెండి ధర మరింత తగ్గనుంది. నిన్న హైదరాబాద్ లో కిలో వెండి రూ. 76 వేలు ఉండగా ఇవాళ ఉదయం రూ. 200 పెరిగింది. దీంతో ఇవాళ ఉదయం కిలో వెండి రూ. 76,200 వద్ద ఉంది. ప్రస్తుతం అంటే ట్రేడ్ మొదలయ్యాక కిలో వెండి మీద రూ. 500 తగ్గడంతో ప్రస్తుతం రూ. 75,700 వద్ద కొనసాగుతుంది.