బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు భారీగా పతనమైంది.
పసిడి ప్రియులకు అలర్ట్. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమైంది. కనిష్ట స్థాయికి పడిపోయింది. 4 నెలల క్రితం 2050 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ క్రమంగా పతనమవుతూ వస్తుంది. రెండు రోజుల క్రితం వరకూ 1920 డాలర్ల వద్ద ఉన్న గోల్డ్ ఇవాళ ఏకంగా 13 డాలర్ల మేర పతనమైంది. మొన్న, నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1920 డాలర్ల వద్ద కొనసాగడంతో దేశీయంగా పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ. 54,650 వద్ద కొనసాగుతుంది. నిన్న ఇదే ధర పలికింది.
ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 59,620 ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది. అయితే బంగారం కొనాలనుకునే వారు ఇవాళ కంటే రేపు కొనడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1907 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న 1920 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ ఇవాళ 13 డాలర్లు తగ్గింది. కాబట్టి రేపు దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇక వెండి విషయానికొస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి.. ప్రస్తుతం 22.65 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న గరిష్టంగా 22.74 డాలర్లకు చేరిన స్పాట్ వెండి.. నిన్న సాయంత్రానికి క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. 22.36 డాలర్లకు పతనమైంది.
దీంతో దేశీయంగా ఇవాళ వెండి ధరలు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 76,200 ఉండగా ఇవాళ రూ. 200 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 76,000 వద్ద కొనసాగుతుంది. అయితే వెండి ధర మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 22.65 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ పెరిగింది. కాబట్టి దేశీయంగా ధర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెండి ఇవాళ కొనుక్కోవడం మంచిది.