ఇల్లో, పొలమో కొనేందుకు లేదా బిడ్డలను ఉన్నతంగా చదివించేందుకో, అవసరానికి, అక్కరకో ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం,వెండి నగలు. కొంత మొత్తంలో అత్యవసరంగా డబ్బులు కావాలంటే.. వీటిని అమ్మోయనక్కర్లేదు. తాకట్టు పెట్టి మన అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకే భారత్లో బంగారం, వెండి, డైమండ్, ప్లాటినం వంటి ఆభరణాల సంబంధిత ఖనిజాలకు డిమాండ్ ఎక్కువ.
ఇంట్లో ఏ వస్తువులకు తాళం వేయము కానీ.. నగదు, ఇతర డాక్యుమెంట్స్ తర్వాత బంగారం వస్తువులనే జాగ్రత్త పరిచేది. అంతటి విలువ ఉన్నాయి కాబట్టే భద్రంగా దాస్తాం. ఇల్లో, పొలమో కొనేందుకు లేదా బిడ్డలను ఉన్నతంగా చదివించేందుకో, అవసరానికి, అక్కరకో ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం,వెండి నగలు. కొంత మొత్తంలో అత్యవసరంగా డబ్బులు కావాలంటే.. వీటిని అమ్మోయనక్కర్లేదు. తాకట్టు పెట్టి మన అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకే భారత్లో బంగారం, వెండి, డైమండ్, ప్లాటినం వంటి ఆభరణాల సంబంధిత ఖనిజాలకు డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్కు ఉండే మామూలు ఇష్టం కాదు.
ప్రస్తుతం పసిడి, వెండి ధరలు గత కొన్ని రోజులుగా దిగి వస్తున్నాయి. ఒక్కోసారి స్థిరంగాను ఉంటున్నాయి. అంతర్జాతీయంగానూ వీటి ధరలు హెచ్చు తగ్గులు నమోదు చేస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ తగ్గు ముఖం పడుతున్నాయి. . ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1961 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.56 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత కరెన్సీ రూపాయి విలువ రూ. 82.530 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. ఇక మన మహానగరాలైన ఢిల్లీ, హైదరాబాద్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు కూడా ఢిల్లీలో బంగారం, సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజుల పాటు ధరల్లో వ్యత్యాసం లేకపోవడం చాలా అరుదుగా జరుగుతుంది.
ఢిల్లీలో ఫ్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 60, 480వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55, 450 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే కిలో వెండి ధర రూ. 73 వేలగా కొనసాగుతుంది. ఇక భాగ్య నగరిలో మేలిమి బంగారం 60, 330గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,450గా పలుకుతోంది. వెండి మాత్రం హైదరాబాద్లో కిలోకి రూ. 100 తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 77, 700 మార్కు వద్ద కొనసాగుతుంది. ఇక ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా టాక్సులు బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని గమనించి కొనుగోలు చేయడం ఉత్తమం.