నెల నెల కొంత మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఎన్నో స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పీపీఎఫ్ నుంచి మెరుగైన రాబడులు పొందవచ్చు. నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగులకు, నెల మొత్తం మీద కొంత మొత్తంలో పొదుపు చేయాలనుకునేవారికి పీపీఎఫ్ చాలా ఉత్తమం. ఇందులో ప్రతి నెలా కేవలం రూ.5000 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి రూ.16 లక్షలకు పైగా రిటర్న్స్ పొందవచ్చు.
నెలకు రూ. 5000 పొదుపుతో 16 లక్షలు
ఇందులో మీరు ప్రతి నెలా రూ.5,000 పెట్టుబడి పెట్టారనుకుందాం. మీ పెట్టుబడి సంవత్సరానికి రూ. 60,000 అవుతుంది. ఈ లెక్కన 15 సంవత్సరాలకు రూ. 9 లక్షలు పెట్టుబడి పెడతారు. మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 16,27,284 లక్షలు రిటర్న్స్ వస్తాయి. ఇందులో మీ పెట్టుబడి రూ. 9 లక్షలు కాగా, రూ.7.27 లక్షల కంటే ఎక్కువ సంపద లాభం ఉంటుంది. ఒక వేళ వడ్డీ రేటు పెరిగినట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు పొందే అవకాశం కూడా ఉంది.
పీపీఎఫ్ పథకం:
పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఈ పథకానికి ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. పీపీఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. దీని తర్వాత, మీరు ఈ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రతి 5 సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేయవచ్చు.
పీపీఎఫ్పై రుణం:
మీరు పీపీఎఫ్ స్కీమ్పై రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆరు సంవత్సరాల మీరు కొంత మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నెలకు రూ.210 కడితే రూ.5,000 పెన్షన్.. భారీగా చేరుతున్న జనం!
ఇదీ చదవండి: Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రోజుకు రూ. 50 పొదుపుతో రూ. 35 లక్షల ప్రయోజనం!