జూన్ 30 డెడ్ లైన్. ఖచ్చితంగా ఈ గడువు తేదీలోగా కొన్ని పనులు పూర్తి చేయాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
జూన్ నెలలో ఖచ్చితంగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. జూన్ 30 లోపు ఈ పనులను పూర్తి పూర్తి చేయాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాన్ కార్డుని, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి ఈ నెల 30 వరకే సమయం ఉంది. మీరు కనుక ఇప్పటి వరకూ పాన్, ఆధార్ అనుసంధానం చేయకపోతే కనుక వెంటనే చేసుకోండి. లేదంటే జూన్ 30 తర్వాత పాన్ కార్డు చెల్లదు. దీని వల్ల బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా జరపడానికి ఉండదు. 50 వేల కంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఉండదు. రుణాలు వంటివి తీసుకోవడానికి ఉండదు. ప్రభుత్వ పథకాలను పొందడానికి వీలుండదు. కాబట్టి జూన్ 30 లోపు పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలి. ఆన్ లైన్ లో చేసుకోవచ్చు.
ఈ నెలలోనే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన మరొక పని ఈపీఎఫ్ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం. అధిక వేతనంపై అధిక పెన్షన్ రావాలి అనుకునే ఉద్యోగులు ఖచ్చితంగా జూన్ 26 లోపు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మరొకటి ఆధార్ అప్డేట్ చేసుకోవడం. గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేసుకోని వారు ఖచ్చితంగా ఈ నెల 30 లోపు అప్డేట్ చేసుకోవాలి. ఉచితంగా చేసుకోవాలనుకుంటే మాత్రం జూన్ 14 వరకే గడువు ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మై ఆధార్ ద్వారా పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ కి సంబంధించి నిబంధనలు ఈ నెలలోనే మారబోతున్నాయి. చాలా మంది బ్యాంకు లాకర్ తీసుకునే ఉంటారు. ఇందులో బంగారం, డాక్యుమెంట్స్ వంటివి భద్రపరచుకుంటారు. దీని కోసం బ్యాంకుతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఉంటారు. అయితే ఎవరికైతే లాకర్ ఉందో వారు బ్యాంకుకు వెళ్లి అగ్రిమెంట్ ని రెన్యూవల్ చేసుకోవాలి. అయితే అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ఎవరికైతే రెన్యూవల్ చేసుకోవాలని లెటర్ లేదా మెయిల్ పంపుతుందో వారు మాత్రమే చేసుకోవాలి. జూన్ 30 లోపు రెన్యూవల్ చేయించుకోవాలి. లాకర్ ఉండి రానివారికి బ్యాంకులు తర్వాత మెయిల్ లేదా మెసేజ్ పంపిస్తాయి. వారు సెప్టెంబర్ 30, డిసెంబర్ 31వ తేదీల్లోపు లాకర్ అగ్రిమెంట్ ని రెన్యూవల్ చేయించుకోవచ్చు. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులకు రెన్యూవల్ చేసుకోవాలని సమాచారం అందించాయి.
ఎస్బీఐ బ్యాంకు తీసుకొచ్చిన వీకర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఈ నెలాఖరున ముగియనుంది. అధిక వడ్డీ కావాలనుకునేవారు జూన్ 30 లోపు ఈ పథకంలో చేరాలి. ఈ పథకంలో చేరిన వారికి 7.5 శాతం వడ్డీ వస్తుంది. మరో పథకం కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. అదే ఎస్బీఐ అమృత్ కలశ్. ఈ స్కీం కాలపరిమితి 400 రోజులు ఉంటుంది. ఈ పథకం ద్వారా 7.6 శాతం వడ్డీ వస్తుంది. అధిక వడ్డీ కావాలనుకునేవారు జూన్ 30 లోపు చేరవచ్చు. ఇండియన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇండియన్ బ్యాంక్ ప్రవేశపెట్టిన స్పెషల్ స్కీం ‘ఇండ్ సూపర్ 40 డేస్’ జూన్ 30తో ముగియనుంది. ఈ పథకం ద్వారా 8 శాతం వడ్డీ లభిస్తుంది. ఎక్కువ వడ్డీ కావాలనుకునేవారు గడువు తేదీలోపు ఈ పథకంలో చేరవచ్చు. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. సంరక్షకుల (గార్డియన్స్) ద్వారా మైనర్ల పేరుపై మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనే అంశానికి సంబంధించిన కీలక సూచనలు చేసింది. నేరుగా సంరక్షకుల బ్యాంకు ఖాతా నుంచే పెట్టుబడి పెట్టవచ్చు. జూన్ 15 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.