100 సంవత్సరాల వరకు ప్రతి ఏటా రిటర్న్స్ అందించే ఏకైక పథకం. రోజుకు 44 రూపాయలను పెట్టుబడిగా మలచుకుంటే 100 ఏళ్లలో దాదాపు 28 లక్షల రూపాయలను రాబడిగా పొందవచ్చు.
భవిష్యత్.. భవిష్యత్.. ఎవరినోటా విన్నా దీని ధ్యాసే. ఇప్పుడంటే బాగానే ఉన్నాం.. రాబోవు సమయం ఎలా ఉంటుందో రూపాయి.. రూపాయి వెనకేసుకోవాల్సిందే అని చెప్తుంటారు. అందులోనూ కరోనా మహమ్మారి వంటి అవరోధాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. లేదంటే అత్యవసరంగా లక్షల రూపాయలు కావల్సిరావచ్చు. అలాంటి పరిస్థితే వస్తే సాధారణ, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారమే అవుతుంది. చేయి చాచి తోటి వారిని అడిగినా.. వేలల్లో సాయపడొచ్చు కానీ లక్షల రూపాయలు అంటే కష్టమే. అలాంటి సమయంలో మీకు సహాయపడేవి, భరోసానిచ్చేవి.. ప్రభుత్వ పథకాలు, పాలిసీలే.
ఒకవేళ మీదీ భవిష్యత్తుపై దిగులే అయితే ఒక మంచి పాలసీ ఎంచుకొని.. పొదుపు ప్రారంభించండి. దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి అందిస్తోన్న ఒక పాలసీ వివరాలు మీకు అందిస్తున్నాం.. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు. అలాగే, ప్రభుత్వ సంస్థ కనుక సురక్షితమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ అద్భుతమైన పాలసీ పేరు.. ‘ఎల్ఐసి జీవన్ ఉమంగ్’. ఈ పాలసీ అనేక అంశాలలో ఇతర పథకాల కంటే భిన్నంగా ఉంటుంది. అవేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్ఐసి జీవన్ ఉమంగ్ అనేది ఒక ఎండోమెంట్ ప్లాన్. 90 రోజుల నుంచి 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇందులో లైఫ్ కవర్తో పాటు, మెచ్యూరిటీపై ఒకేసారి మొత్తం లభిస్తుంది. దీని కింద మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం స్థిర ఆదాయం వస్తుంది. ఈ పథకం అందించే మొ గొప్ప ప్రయోజనం.. ఇది 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది. అలాగే, పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులు అందిస్తారు.
మీరు పెద్ద మొత్తంలో రాబడి పొందాలనుకుంటే.. ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించక తప్పదు. ఉదాహరణకు మీరు రూ.28 లక్షల రాబడి పొందాలనుకుంటే.. రోజుకు రూ. 44 చొప్పున నెలకు రూ.1302 ఏడాదికి రూ.15,298 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే.. ఆ మొత్తం దాదాపు రూ.4.58 లక్షలు అవుతుంది. అనంతరం మెచ్యూరిటీ ముగిశాక.. 31వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 40 వేల రాబడి ప్రారంభవుతుంది. అలా 31వ యేట నుంచి 100 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఇలా దాదాపు 27.60 లక్షల రూపాయల మొత్తం మీకు లభిస్తుంది.