పొదుపు చేయాలనే ఆలోచన ఉండాలే కానీ, ఎన్నో పొదుపు పథకాలు, పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంపాదించేది నాలుగు రూపాయలే అయినా అందులో ఒక రూపాయిని మీ పొదుపుగా మలుచుకోండి.. ఇదే మీ భవిష్యత్తుకు దారి చూపుతుంది. వయసులో ఉన్నప్పుడు ఆర్థిక కష్టాలు మనకు కనిపించవు. వయసు పైబడుతున్న కొద్దీ డబ్బు విలువ తెలుస్తుంది. రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితిలొస్తాయి. అందులోనూ.. ఏ చిన్న అనారోగ్యం ధరిచేరినా వేలకు వేలు దండుకుంటున్నారు. ఆ సమయంలో మీ భవిష్యత్తుకు భరోసానిచ్చేవి.. పొదుపు పథకాలు, పాలసీలే. కావున భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక కష్టాలు రాకుండా ఉండాలంటే పొదుపు చేయడం ఆరంభించండి. అద్భుత ప్రయోజనాలు అందించే ఓ ప్రత్యేక పాలసీ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..
దేశీయ భీమా సంస్థ ఎల్ఐసీ మహిళల కోసమే ఓ ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది.దీని పేరు.. ‘ఎల్ఐసీ ఆధార్ శిలా‘. ఇందులో రోజుకు రూ.58 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.8 లక్షలు మీ చేతికి అందుతాయి. ఈ పాలసీ ఎలా తీసుకోవాలి..? అర్హతలేంటి..? ప్రయోజనాలేంటి..? అన్నది ఇప్పుడు చూద్దాం.. 8 నుండి 55 సంవత్సరాల వయసున్న మహిళలు ఎవరైనా ఇందులో చేరవచ్చు. ఈ పాలసీ కనీస వ్యవధి 10 సంవత్సరాలు.. గరిష్టంగా 20 సంవత్సరాలు. ఇందులో కనిష్టంగా రూ.75వేలు.. గరిష్టంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. నెల, 3 నెలలు, 6 నెలలు లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ఏడాదికోసారి ఎంచుకుంటే ప్రీమియం మొత్తంపై 2 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తారు. అలాగే.. పాలసీ ముగిసేవరకు పాలసీదారులు జీవించివుంటే మెచ్యూరిటీ మొత్తంపై బోనస్ కూడా ఇస్తారు. ఒకవేళ పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే నామినీకి ఈ మొత్తాన్ని అందిస్తారు.
ఉదాహరణకు.. 30 ఏళ్ళ వయసు ఉన్న ఒక మహిళ 20 సంవత్సరాల కాలవ్యవధితో ఈ పాలసీ తీకున్నారనుకుందాం.. అప్పుడు ఆమె ప్రతిరోజూ రూ. 58 పెట్టుబడి పెట్టాల్సి ఉంది. లేదా ఏడాదికి ఒకసారి చెల్లించాలనుకుంటే.. రూ. 20వేలు పైబడి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్ల పాటు ఆమె ప్రీమియం చెల్లిస్తూ పోతే.. ఆమె చెల్లించిన మొత్తం రూ. 4 లక్షలు దాటుతుంది. అనంతరం మెచ్యూరిటీ ముగిశాక ఈ మొత్తానికి వడ్డీ, బోనస్ కలిపి దాదాపు రూ. 8లక్షలు ఆమె చేతికొస్తాయి.
గమనిక: పాలసీ టెన్యూర్, పాలసీదారుల వయసు, ఎంచుకునే ప్రీమియం మొత్తం, బీమా విలువను బట్టి రాబడి ఉంటుంది. కావున పాలసీ తీసుకునేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది.