మన సమాజంలో రెండు రకాల కార్మికులుంటారు.. సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేస్తుంటారు. మొదటి కోవకు చెందిన వారు నెలనెలా స్థిరమైన ఆదాయం పొందుతారు. అసంఘటిత రంగం అంటే.. రోజు వారి కూలికి పని చేసే కార్మికులు. ఇళ్లల్లో పని చేసే పని మనుషులు మొదలు.. భవన నిర్మాణ రంగం, వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారు ఈ కోవకు వస్తారు. పని దొరికితే డబ్బులు.. లేదంటే పస్తులు అన్నట్లు ఉంటుంది వీరి పరిస్థితి. ఇక దురదృష్టం కొద్ది ఏవైనా ప్రమాదాలు జరిగి.. అంగవైకల్యం వంటివి చోటు చేసుకుంటే.. ఇక ఆ కుటుంబం పరిస్థితి వర్ణించడానికి మాటలు చాలవు. ఆదుకునే వాళ్లు లేక.. ఆర్థిక పరిస్థితులు చితికి పోయి.. రోడ్డున పడతారు. ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవారి కోసం కేంద్రం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..
కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం పేరు సెంట్రల్ లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్. తెల్ల రేషన్కార్డు ఉన్నవారంతా దీనికి అర్హులే. ఈ పథకంలో చేరి ఏటా కేవలం 22 రూపాయలు చెల్లిస్తే.. ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. 18 ఏళ్లు పైబడిన వారంతా ఈ పథకంలో చేరడానికి అర్హులే. ఇక దీనిలో చేరిన వారికి.. నగదు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంటే.. బీమా డబ్బులు మాత్రమే కాక.. పిల్లలకు జన్మనిచ్చిన సమయంలో కూడా ఆర్థిక సాయం లభిస్తుంది. ఇద్దరు పిల్లలకు ఇది వర్తిస్తుంది. వారికి ఒక్కొక్కరికి 30 వేల చొప్పున డబ్బులు చెల్లిస్తారు.
ఇక ఆడపిల్లకు పెళ్లి చేసే సమయంలో 35 వేల రూపాయల నగదు ప్రయోజనం లభిస్తోంది. ఇక ఈ పథకంలో చేరిన వారు.. ఏదైనా ప్రమాదంలో అంగవైకల్యం బారిన పడితే.. ఏకంగా 1,50,000 మొత్తం లభిస్తోంది. ఈ పథకం పూర్తి వివరాలు తెలియాలంటే.. కింద వీడియో చూడండి. మరి ఇలాంటి పథకాలు, స్కీమ్ల గురించి సామాన్యులకు పూర్తి స్థాయిలో తెలుస్తుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.