ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని బోయిన్ పల్లి, ఏపీలోని ఏలూరు సమీపంలో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చేటుచేసుకుని కొందరు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎన్ఎఫ్ ఈటీపీ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి పరిసర ప్రాంతంమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది..హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నంలోని పరవాడ ఫార్మసీటిలోని ఎస్ఎన్ఎఫ్ ఈటీపీ ప్లాంట్ లో చిన్నపాటి మరమ్మత్తుల చేస్తున్నారు. అందులో భాగంగా వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో వాటి నుంచి వచ్చే నిప్పు రవ్వలు ప్రక్కనే ఉన్న కెమికల్స్ మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతం చుట్టూ పొగ కమ్మేసింది. ఈహఠాత్తుపరిణామంతో అక్కడ ఉన్న సిబ్బంది, ఆ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకుని అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోన్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.