నేటికాలంలో మానవత్వం మంటకలిసిపోతుంది. మనిషిలో డబ్బుపై వ్యామోహం పెరిగిపోతుంది. సాటివారికి సాయం చేసే గుణం కరువై.. డబ్బులకోసం సాటివారి ప్రాణాలు తీయడానికైన సిద్దపడే మనుషులు తయరవుతున్నారు. తాజాగా రూ.100 కోసం లారీ డ్రైవర్ ఓ మహిళ ప్రాణాలు తీశాడు. చిలకలూరి పేట నుంచి నాయుడుపాలెంకు వెళ్లేందు కుటుంబ సభ్యులతో కలిసి మహిళ లారీ ఎక్కిదిగింది. ఆ సమయంలో రూ.200 ఇస్తే మరో 100 ఇవ్వాలంటూ డ్రైవర్ డిమాండ్ చేశాడు. ఆ క్రమంలో ఆమె కొడుకు వద్ద ఉన్న సెల్ ఫోన్ లారీ డ్రైవర్ తీసుకున్నాడు. సెల్ ఫోన్ కోసం ఆ మహిళ లారీ ఎక్కుతుండగా.. డ్రైవర్ లారీ ని ముందుకు కదిలించాడు. దీంతో మహిళ పట్టు తప్పి లారీ కింద పడి చనిపోయింది. ఈఘటన గుంటూరు రూరల్ మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన రమణ అనే మహిళ కుటుంబ చెత్త అమ్ముకుని జీవనం సాగిస్తుంది. పనిమీద నాయుడుపాలెం వెళ్లేందుకు.. తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరి పేటలో లారీ ఎక్కారు. అయితే ఎక్కే సమయంలోనే రూ.300 ఇస్తామని డ్రైవర్ కి చెప్పడం జరిగింది. నాయుడుపాలెంలో దిగిన తరువాత తమ దగ్గర రూ.200 మాత్రమే ఉన్నాయి డ్రైవర్ కి తెలిపారు. అవి తీసుకోవాలని లారీ డ్రైవర్ ను కోరారు. అందుకు ఒప్పుకోని లారీ డ్రైవర్ రమణ కుమారుడు వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. దీంతో రమణ, ఆమె మేనకోడలు సెల్ ఫోన్ కోసం లారీ ఎక్కారు.
ఇదీ చదవండి: వీడియో వైరల్: భార్య అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!
ఈ క్రమంలో డ్రైవర్ లారీని ముందుకు కదిలించాడు. దీంతో మేనకోడలు లారీలో ఉండిపోవడంతో..రమణ లారీ డోర్ ను పట్టుకుంది. ఇదే సమయంలో రమణ పట్టు తప్పి లారీ కింద పడి చనిపోయింది. దీంతో డ్రైవర్ లారీని ముందుకు వేగంగా నడిపి.. కొంత దూరం వెళ్లిన తరువాత అమ్మాయిని దించేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే లారీ కి సంబంధించిన వివరాలు తాము నోట్ చేసుకోలేదని, ఆసమయంలో అంత ఆలోచన రాలేదని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.