Bheemili: ఈ మధ్యకాలంలో రాజకీయ నేతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. కొందరు సాధారణంగా మరణిస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల మాజీమంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనారోగ్య కారణంగా మరణించారు. అనంతరం కొన్ని రోజులకే ఆయన సోదరుడు కూడా మృతి చెందారు. ఇలా వరుసగా రాజకీయ నేతల మరణాలతో వారి కార్యకర్తలో తీవ్ర వేదనకు గురవుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం జిల్లా భీమిలి లోని రొట్టెల వీధికి చెందిన దాసరి వెంకటేష్(57) కిరణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఎన్డీఆర్ పై అభిమానంతో తెదేపాలో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ప్రస్తుతం భీమిలిలోని మూడో వార్డు తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తుంది. ఇటీవల ఆమెకు నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే మరోపక్క కొంతకాలం వెంకటేష్ మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారు జామున సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: రూ. 2000 కోసం యువకుడి దారుణ హత్యకొంత సమయం తరువాత వెంకటేష్ మృతదేహం తీరాన్నికి కొట్టుకరావడం స్థానికులు గమనించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి కి చేరుకున్నారు. మానసిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.