ప్రపంచంలో ఇప్పుడు ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు.. తక కుటుంబం చల్లగా ఉంటే చాలు పక్కవాళ్ల గురించి మనకెందుకు అని భావించేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం తమకు ఉన్నదాంట్లో పక్కవారికి కొంత సహాయం చేయడం.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా అనాథలను చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్న అనాధాశ్రమాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. కొంత మంది తమ జీవితాలను అనాథ సేవలకు అంకితం చేస్తుంటారు. అలాంటి వారిలో రూత్ మాక్లీస్ ఒకరు.
లండన్ కి చెందిన రూత్ మాక్లీస్ ఎల్లలు దాటి సత్యసాయి బాబా దర్శనం కోసం వచ్చిన ఆమె ఇక్కడ అనాథ పిల్లలన చూసి మనసు చలించిపోయింది. ఆ పిల్లల కోసం ఏదైనా చేయాలని భావించింది. సత్యసాయిబాబా స్ఫూర్తితో ఓ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి వేల మంది అనాథలకు అమ్మగా మారింది.. చక్కటి విద్యనందించింది. వేల మంది అనాథలకు అమ్మగా మారిన రూత్ మాక్లీస్ ఆదివారం కన్నుమూశారు. దీంతో వేలమంది విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
రూత్ మాక్లిస్ 1941 లో జన్మించారు. ఆమె భర్త చనిపోయిన తర్వాత కొంత కాలం వరకు ఆమె ఎంతో ఆవేదనతో కృంగిపోయారు. ఎంతో మంది విదేశీయులు పుట్టపర్తి సత్యసాయిబాబా దర్శనం చేసుకొని తరిస్తుంటారన్న విషయం తెలుసుకొని ఆమె మనశ్శాంతి కోసం 1996 లో ఇక్కడికి వచ్చారు. బాబా దర్శనం తర్వాత ఆమెకు ఎంతో మనశ్శాంతి కలిగింది. అదే సమయంలో ఇక్కడ ఎంతో మంది పేదరికంతో చదువుకు దూరమైన వీధి బాలలను చూసిన ఆమెకు ఆ పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకుంది. సత్యసాయి బాబా స్ఫూర్తితో మంగళకర చిల్డ్రన్స్ హోమ్ను ని నెలకొల్పింది.
చదువు వదిలేసి వీధుల్లో తిరుగుతున్న పిల్లలను, అనాథలను చేరదీయడం లాంటివి చేస్తూ వారికి చక్కటి విద్యాబుద్దులు నేర్పిస్తూ చిల్డ్రన్స్ హూమ్ ని ఒక దేవాలయంలా మార్చింది రూత్ మాక్లిస్. పాతిక మంది విద్యార్థులతో 2000 సంవత్సరంలో సాయి కమ్యూనిటీ స్కూల్ గా ప్రారంభించి తర్వాత మంగళకర చిల్డ్రన్స్ హోమ్గా మార్చారు. మొదట ఆమె విద్యార్థులకు అద్దె భవనంలో విద్యాబోథన అందిస్తూ వారికి సేవలు చేసింది. మంగలళకర ట్రస్ట్ లో కేవలం చదువు మాత్రమే కాదు.. బట్టల తయారీ, కుట్టు శిక్షణ లాంటివి ఇస్తూ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉన్నారు. అనాథలకు అమ్మ మారిన రూత్ మాక్లీస్ ఇక లేరన్న వార్త విని వేలమంది విద్యార్థులు బోరున విలపించారు.. కన్నీటి వీడ్కోలు పలికారు.