ప్రజల అవసరాలు తీరుస్తూ.., కరోనా లాంటి కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందించి వాలంటీర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. కొంతమంది వాలంటీర్లు మాత్రం వారి స్వార్థం కోసం అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ.. ఆ వ్యవస్థ కే మచ్చ తెస్తున్నారు. తాజాగా.. విజయనగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుసుకుంది. విజయనగరం జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్ రమ్య.. ప్రజలను 3 కోట్ల వరకు మోసం చేసి పరారైన విషయం తెలిసిందే. రమ్య ఆ ప్రాంతంలో వందల మంది దగ్గర నుండి చిట్టీలు, పొదుపు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ డబ్బుని వివిధ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి బాగానే లాభపడ్డారు కూడా. కానీ.., తిరిగి ఆ సొమ్ము చెల్లించాల్సిన సమయం రాగానే వాలంటీర్ రమ్య కనిపించకుండా పోయింది.
రమ్య జాడ తెలియక ఇప్పటికే 10 రోజులు దాటింది. ఈ నేపథ్యంలోనే బాధితులు అంతా పోలీసు స్టేషన్ కి క్యూ కడుతున్నారు. అయితే.. ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే.. రమ్య బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉందట. ఇప్పటి వరకు పోలీసులకి అందిన సమాచారం ప్రకారం.. . రమ్య ఏకంగా పదికోట్లకు పైగా సొమ్ముతో ఉడాయించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి దాదాపుగా ఐదు వందల మందిని రమ్య, ఆమె తల్లి మోసం చేసినట్టు తెలుస్తోంది.
కేసు ఇలా రోజురోజుకి పెద్దది కావడం, బాధితులు 500 మందికి పైగా కావడం, వారంతా నిరుపేదలు కావడంతో పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుని మామూలు చీటింగ్ కేసులా తేలికగా తీసుకోకుండా.., రమ్య నేరాల చిట్టాని బయటపెట్టేలా మొత్తం సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నారట పోలీసులు. రేపో, మాపో రమ్య పట్టుబడటం తప్పదు కాబట్టి.., ఈ కేసులో వాలంటీర్ కి పెద్ద శిక్ష పడేలా చేయడానికి పోలీసులు అన్నీ సిద్ధం చేస్తున్నారట. మరి.. ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన వాలంటీర్ రమ్యకి ఏ శిక్ష పడాలని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.